సరిలేరు నీకెవ్వరూ లో ఆ సీన్లు కట్..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా ప్రకటన విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ కూడా అభిమానుల్లో మరింత హైప్ పెంచేసింది . ఇక తాజాగా ఈ సినిమా జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సక్సెస్ ఫుల్ హీరో... సక్సెస్ ఫుల్ దర్శకుడు కాంబినేషన్లో సినిమా వస్తే ఎంత సక్సెస్ ఫుల్ గా ఉంటుందో ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. జనవరి 11న విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్ బాబు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరిపోయింది.
ఇక సంక్రాంతి పండుగ ముందు విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాతో మరోసారి 100 కోట్ల క్లబ్బులో చేరిపోయాడు మహేష్ బాబు. సంక్రాంతి ముందు జనవరి 11న విడుదల కావడంతో సంక్రాంతి సెలవులకు అందరూ ఈ సినిమా చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపరు. దీంతో భారీగా వసూళ్లు రాబట్టినది ఈ సినిమా. అంతేకాకుండా ఈ సినిమాలో మహేష్ బాబు కామెడీ టైమింగ్ కి దర్శకుడు అనిల్ రావిపూడి పంచ్ డైలాగులు తోడవడంతో ప్రేక్షకులందరూ కడుపుబ్బ నవ్వుకున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలు మాస్ లుక్ తో మహేష్ బాబు అదరగొట్టేసారు. ఇక పదమూడేళ్ల తర్వాత ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన విజయశాంతి మరోసారి తన నటనలో ఉన్న పవర్ ఏంటో చూపించారు.
అయితే సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. అయితే ఈ సినిమాలో అన్ని సమపాళ్లలో ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ ట్రైన్ సీన్ కాస్త ఎక్కువగా ఉందని బోర్ గా ఫీల్ అయినట్టు టాక్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ట్రైన్ లో ఉన్న ససీన్ లలో కొన్ని సీన్లను కట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ట్రైన్ సీన్లలో బండ్ల గణేష్ సన్నివేశం వరకు తొలగించాలని చిత్రయూనిట్ భావిస్తోందట. దీంతో ట్రైన్ సీన్ కొంచెం సమయం ఉంటుంది కాబట్టి ప్రేక్షకులకు అంతగా బోర్ కొట్టదని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం.