తమన్నాను ఆ పుస్తకం అంతలా మార్చేసిందా?
తాను ప్రస్తుతం ఆధ్యాత్మకతలో ఉన్నానని. అందుకు కారణం `ఓషో` అనే పేరు గల పుస్తకం వల్లే తను ఆధ్యాత్మికతను అర్ధం చేసుకోవడానికి పనికొచ్చిందని చెప్పుకొచ్చింది. అలాగే తన జీవనశైలి పై విపరీతమైన ప్రభావాన్ని చూపిన మరో పుస్తకం రోరే ఫ్రీడ్మాన్ అండ్ కిమ్ బర్నౌయిన్ రాసిన `స్కిన్నీ బిచ్`. ఆ పుస్తకం చదివిన తర్వాతే నేను మాంసాహారం మానేశాను అని ఆమె చెప్పింది. ఆ పుస్తకం చదివిన తర్వాత తనకు నాన్వేజ్ మీద అస్సలు ఉండేది కాదని అసలు తినడానికి ఇష్టపడలేదని చెప్పింది.
గత ఏడాదిలో వెంకటేష్తో కలిసి ఎఫ్2 లో నటించి మంచి విజయాన్ని సాధించింది. తర్వాత చిరంజీవితో కలిసి సైరా నరసింహారెడ్డిలో తన పాత్రకు ఎంతో మంచి పేరు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే తమన్నా తన పాత్రలో లీనమయి చేసిందని చెప్పాలి. సంక్రాంతి బరిలో నిలిచిన సరిలేరు నీకెవ్వరులో స్పెషల్ పార్టీ సాంగ్ తో కుర్రకారుని ఆకట్టుకుంది. ఎప్పటినుంచో వాయిదాలో ఉన్న దటీజ్ మహాలక్ష్మి విడుదల కోసం వేచి చూస్తోంది. అంతేకాక గోపిచంద్తో కలిసి కబడి నేపధ్యంలో తెరకెక్కుతున్న మరో చిత్రంలో కూడా హీరోయిన్గా నటిస్తోంది.