ప్రభాస్ అభిమానులలో చిచ్చు రేపుతున్న అల సరిలేరు రికార్డులు !

Seetha Sailaja

సంక్రాంతి రేస్ ముగిసి పోయినా ఇంకా ‘అల’ ‘సరిలేరు’ సినిమాల కలక్షన్స్ రికార్డుల ప్రచారం ఆగడం లేదు. ఈ రెండు సినిమాల నిర్మాతలు పోటాపోటీగా తమ మూవీ ‘బాహుబలి’ వన్ రికార్డులను క్రాస్ చేసింది అంటూ చేస్తున్న ప్రచారం ప్రభాస్ అభిమానులకు అసహనాన్ని కలిగిస్తోంది.

దీనికితోడు నిన్న జరిగిన ‘అల’ మీడియా మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ కొన్ని సెంటర్స్ లో ‘అల’ మూవీ కలక్షన్స్ ‘బాహుబలి’ వన్ రికార్డులను బ్రేక్ చేసిన విషయం తన దృష్టి వరకు వచ్చింది అంటూ అరవింద్ అత్యుత్సాహంతో చేసిన కామెంట్స్ ప్రభాస్ అభిమానులలో మరింత చిచ్చును రేపుతున్నాయి. వాస్తవానికి ‘బాహుబలి’ 1 ‘బాహుబలి’ 2 రికార్డులు చాల పెద్దవి. వాటిని దాటడం ఇప్పట్లో ఏ టాప్ హీరోకు సాధ్యం కాని పని. ‘సాహో’ కూడ ‘బాహుబలి’ రికార్డులకు దరిదాపులకు కూడ రాలేక పోయింది. 

ప్రస్తుత పరిస్థితులలో ఒక టాప్ హీరో సినిమా ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయాలి అంటే టిక్కెట్ 500 రూపాయలు పెట్టినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయాలను ఏమి పట్టించుకోకుండా ‘బాహుబలి’ వన్ దాటాము అంటూ ‘సరిలేరు’ టీమ్ డైరెక్ట్ గా చెప్పకపోయినా అదే అర్ధాన్ని క్రియేట్ చేస్తూ ‘అల’ టీమ్ ముఖ్యంగా అల్లు అరవింద్ వ్యూహాత్మకంగా అంటున్న మాటలు ప్రభాస్ అభిమానులకు ఆశ్చర్యంతో పాటు అసహనాన్ని కూడ కలిగిస్తున్నాయి. 

వాస్తవానికి ‘సరిలేరు నీకెవ్వరు’ కన్నా ‘అల వైకుంఠపురములో’ ఆధిపత్యం కొనసాగుతోంది అన్న మాటలు వాస్తవమే అయినా బన్నీ సినిమా తరువాత మహేష్ సినిమా అన్న వాస్తవాన్ని గుర్తించడానికి మహేష్ సన్నిహితులతో పాటు మహేష్ అభిమానులు కూడ తీవ్రస్థాయిలో సహనాన్ని కోల్పోతున్నారు. అయితే ఇంత రగడ జరుగుతున్నా బన్నీ ఓపెన్ అవుతున్నాడు కాని ఇండియాకు చాల దూరంలో అమెరికాలో ఉన్న మహేష్ మాత్రం ఈ విషయం పై తన మౌనాన్ని కొనసాగిస్తున్న పరిస్థితులలో మరో టాప్ హీరో బ్లాక్ బష్టర్ హిట్ వచ్చే వరకు బన్నీ మహేష్ ల మధ్య వార్ ఇలాగే కొనసాగుతుందా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: