వేరొకరిని నేను తక్కువ చేయను.....మా సినిమాకు వచ్చిన వసూళ్లు మేము ప్రకటించాం.....!!

GVK Writings

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే రెండేళ్ల క్రితం నటించిన భరత్ అనే నేనుతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. అలానే గత ఏడాది వచ్చిన మహర్షి తో మరొక సూపర్ హిట్ అందుకున్న మహేష్, ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరిలేరు నీకెవ్వరు తో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకుని ఏకంగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. దీనితో ఎన్నడూ లేనంత ఆనందాన్ని మహేష్ తో పాటు వ్యక్తం చేస్తోంది సరిలేరు యూనిట్. దిల్ రాజు, మహేష్ బాబు, అనిల్ సుంకర లు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాను, పేట్రియాటిక్ బ్యాక్ డ్రాప్ లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించడం జరిగింది. 

 

ఇప్పటికే కెరీర్ పరంగా వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న అనిల్ కు కూడా ఈ సినిమా సక్సెస్ మరింత బూస్ట్ ని ఇచ్చింది. ఇకపోతే ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల అలవైకుంఠపురములో సినిమా కూడా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయి మంచి హిట్ తో పాటు కలెక్షన్స్ కూడా అందుకుంది. ఇక అక్కడి నుండి రెండు సినిమాల నిర్మాతల మధ్య మొదటి నుండి కలెక్షన్స్ వార్ కొనసాగుతూ వస్తోంది. మా సినిమా ఎక్కువ వసూలు చేసిందంటే, మా సినిమా మరింత ఎక్కువ వసూలు చేసింది అంటూ ఒకరిని మించేలా పోస్టర్స్ వదులుతూ వచ్చారు. ఎట్టకేలకు సరిలేరు టీమ్ సైలెంట్ అవడంతో అల టీమ్ కూడా ఒకింత సైలెంట్ గా ఉంది. 

 

అనంతరం ఇటీవల మహేష్ బాబు ఈ సినిమా సక్సెస్ ని తన ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేసేందుకు విదేశాలకు వెళ్లిపోయారు. అయితే కొద్దిరోజుల క్రితం విదేశాలకు వెళ్లేముందు తన సన్నిహితులను కలిసిన మహేష్ బాబు, ఈ రెండు సినిమాల కలెక్షన్ విషయమై ప్రస్తావిస్తూ, నిజానికి రెండు సినిమాలు బాగా కలెక్ట్ చేశాయని తనకు తెలిసిందని, అలానే మరొకరి సినిమాని తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని వారి వద్ద ప్రస్తావించిన సూపర్ స్టార్, తమ సినిమాకు వచ్చిన వసూళ్లను డిస్ట్రిబ్యూటర్ల వివరాల మేరకే ప్రకటించడం జరిగిందని అన్నారట......!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: