ట్యాలెంటెడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన గత రెండు చిత్రాలు అతనికి భారీ షాక్ ఇచ్చాయి. అందులో భాగంగా 2018 చివర్లో శర్వా .. పడి పడి లేచె మనసుతో రాగ ఆ చిత్రం డిజాస్టర్ ఫలితాన్ని రాబట్టింది. ఆ తరువాత గత ఏడాది గ్యాంగ్ స్టార్ డ్రామా రణరంగంతో రాగ ఈ చిత్రం కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేసింది దాంతో ఈ హీరో మార్కెట్ పడిపోయింది.
ఇక ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని శర్వా ఓ సూపర్ హిట్ రీమేక్ సినిమా తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. స్టార్ హీరోయిన్ సమంత , శర్వానంద్ జంటగా నటించిన తాజా చిత్రం జాను. కోలీవుడ్ కల్ట్ మూవీ 96 కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. అయితే హిట్ సినిమాకు రీమేక్ గా వస్తున్నా.. ఈ చిత్రానికి రావాల్సిన బజ్ మాత్రం రావడం లేదు కేవలం సమంత ఉందన్న కారణంతోనే సినిమా పై ఎంతో కొంత అంచనాలు వున్నాయి. దాంతో ఈ చిత్రం 20కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగలిగింది.
మొదటి రోజు సమంత ఎలాగూ ప్రేక్షకులను థియేటర్లలో కి తీసుకొస్తుందనడం లో సందేహం లేదు ఆమె కు తోడు సినిమా లో విషయం ఉంటే శర్వా ఊహించిన విజయం ఖాయమే. మరి వరసగా రెండు డిజాస్టర్ల తో డీలా పడ్డ శర్వా ను సమంత కాపాడుతుందో లేదో చూడాలి. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ జాను ను తెరకెక్కించగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. గోవింద్ వసంత సంగీతం అందించాడు. ఇదిలా ఉంటే శర్వా ప్రస్తుతం కిషోర్ డైరెక్షన్ లో శ్రీకారం అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 24న విడుదలకానుంది.