ఫ్యాన్స్ ప్రేమకు ఖుషీ ఖుషీగా రష్మిక!
ఛలో చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన తెలుగు లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఈ అమ్మడు నటిస్తున్న చిత్రాలు వరుసగా హిట్ కావడంతో గోల్డెన్ లెగ్ అంటున్నారు. ఇప్పటికే స్టార్ హీరోల సరసన వరుసగా ఛాన్సులు దక్కించుకుంటుంది. ఈ ఏడాది అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘ సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అంతే కాదు ఈ అమ్మడు మరికొంత మంది స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకుంది.
ఆ మద్య రష్మిక ఇంటిపై ఐటీ దాడులు జరిగాయంటే ఈ అమ్మడి సంపాదన కూడా ఆ రేంజ్ లో ఉందని అర్థం అవుతుంది. కన్నడంలో నటించిన కిర్రాక్ పార్టీ తో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయిన రష్మిక కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో వరుస ఛాన్సులు దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఫాన్స్ తనపై చూపిస్తున్న అభిమానాని ట్విట్టర్ ద్వారా తెలిపింది . మీ అందరి మద్దతు ఏ నన్ను ఈ స్టేజ్ కి తీసుకుని వచ్చింది. విభిన్నమైన, మంచి పాత్రల్లో నటించినందుకు కాదు గానీ, మీ అందరి అభిమానాన్ని పొందినందుకు నేను పండగ చేసుకుంటాను.
లవ్ యూ ఆల్" అంటూ... ఫ్యాన్స్ తనపై చూపిస్తున్న అభిమానానికి అందాల నటి రష్మిక మందన్న ఉబ్బితబ్బిబ్బు అవుతోంది. ఈ అమ్మడు నటిస్తున్న 10వ చిత్రం 'బీష్మ' 21న విడుదలవుతున్న నేపథ్యంలో అభిమానులు ట్విట్టర్ వేదికగా ఓ హ్యాష్ ట్యాగ్ ను 'రష్మిక 10 ఆన్ ఫిబ్ 21' పేరుతో సృష్టించారు. ఇక ఈ హ్యాష్ ట్యాగ్ పలు రకాల రష్మిక చిత్రాలు, ట్వీట్లు, అభినందనలు, ప్రశంసలతో నిండిపోయింది. వీటన్నింటినీ చూసిన రష్మిక, ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఈ ట్వీట్ పెట్టింది. ఏది ఏమైనా తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్న రష్మిక మరిన్ని విజయాలు అందుకోవాలని ఫ్యాన్న్ కోరుకుంటున్నారు.
OMG! Really? It’s my 10th already? I still feel like a newbie!😵😵 I’ve gotten here only with your support. Instead of celebrating because I got to do so many good roles, I’m going to celebrate for getting such a strong support system who I actually always rely on✨
I love you!♥️ https://t.co/dd2xT1kZkZ — rashmika mandanna (@iamRashmika) February 16, 2020