మొత్తానికి ఎన్టీఆర్, మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో చిత్రం రానుంది. ఇటీవలె ఈచిత్ర పోస్టర్ని కూడా విడుదల చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్ర షూటింగ్ మేలో మొదలవనుందని సమాచారం. దీన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే మరోసారి సూపర్స్టార్తో త్రివిక్రమ్ పోటీ పడక తప్పడం లేదు. సూపర్స్టార్ మహేష్ త్వరలో ప్రారంభించనున్న వంశీపైడిపల్లి చిత్రం కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి వీరిద్దరి సినిమాల మధ్య నడిచిన పోటీ మాములుది కాదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. సినిమాల విడుదల తర్వాత కూడా రెండు చిత్రబృందాల నుంచి పోటాపోటీగా కలెక్షన్ల ప్రకటనలు విడుదలయ్యాయి. ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు. మరోసారి ఇదే పునరావృతం అయ్యేలా ఉందంటూ అందరూ భావిస్తున్నారు. ఈసారి పోటీ ఎలా ఉండబోతుందో మళ్ళీ రచ్చ మొదలే అన్నమాట.
పైగా ఇది ఓ పక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్, మరో పక్క మహేష్ ఇక ఈ సారి వీరిద్దరి రచ్చ మాములుగా ఉండదు మరి ఏం జరుగుద్ది కథ కథనాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది తెలియాల్సి ఉంది. అయితే దీనిపైన అధికారిక ప్రకటన కూడా ఇంకా రావల్సి ఉంది. ఇక ప్రస్తుతం మహేష్ రెస్ట్లో ఉన్నారు. మూడు నెలలపాటు ఆయన సినిమాలకు రెస్ట్ ఇచ్చారు. ఎనట్ఈఆర్ రాజమౌళి సినిమా ఆర్.ఆర్.ఆర్తో బిజీగా ఉన్నారు. మరి ఆ చిత్రం పూర్తవగానే ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్ళనుందని సమాచారం. ఈ సారి మహేష్ ఎన్టీఆర్ల ఫ్యాన్స్ జోరు ఎలా ఉండబోతుందో చూడాలి. అలాగే ఇద్దరు టాప్ డైరెక్టర్స్కి కూడా ఇది పోటీ అనే చెప్పాలి. ఓ పక్క వంశీపైడిపల్లి, మో పక్క మాటల మాంత్రికుడు ఇద్దరూ కలిసి ఏం అద్భుతం సృష్టించబోతున్నారో తెలియాలంటే అప్పటి వరకు వేచి చూడాల్సింది.
మరింత సమాచారం తెలుసుకోండి: