ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భం ఇచ్చిన ప్రసంగంతో షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే (డీ డీ ఎల్ జే) సినిమాను ఇండియాస్ క్లాసిక్ సినిమా అంటూ కీర్తించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని షారూఖ్ సతీమణి గౌరీ ఖాన్న వద్ద ప్రస్తావించగా ఆమె ఆసక్తికరంగా స్పందించారు. 1995లో రిలీజ్ అయిన డీ డీ ఎల్ జే సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కిస్తే బాగుంటుంది.
అంతేకాదు సీక్వెల్ లోనూ షారూఖ్ హీరోగా నటిస్తే ఇంకా బాగుంటుంది. అలా చేస్తారనే నేను భావిస్తున్నా. డీ డీ ఎల్ జే దర్శక నిర్మాత ఆదిత్య చోప్రాతో ఈ విషయం గురించి చర్చిస్తా. భారత్కు వచ్చిన ప్రతీ ప్రముఖుడు డీ డీ ఎల్ జే సినిమాను గుర్తు చేసుకుంటారు` అని చెప్పింది. సూపర్ స్టార్ భార్య అయిన గౌరీ తాను కూడా ఇంటిరియర్ డిజైనింగ్ రంగంలో సూపర్ స్టార్గా ఎదిగేందుకు కష్టపడుతుంది.
అయితే తన ప్రొఫెషన్కు షారూఖ్ ఎలా సాయం చేస్తాడో కూడా వివరించింది గౌరీ. షారూఖ్లో కూడా ఓ మంచి డిజైనర్ ఉన్నాడన్న గౌరీ ఆయన బాలీవుడ్ సూపర్ స్టార్ అయి ఉండకపోతే ఖచ్చితంగా ఆర్కిటెక్ట్ అయి ఉండేవాడని చెప్పింది. `షారూఖ్కు డిజైనింగ్ పట్ట ఆసక్తి, నేను ఆ రంగంలో ఉన్నంత మాత్రానా కలగలేదు. స్వతహాగా ఆయనకు డిజైన్ ల పట్ల మంచి అవగాహన ఉంది. ఆయన కొత్త డిజైన్ లను చాలా ఇష్టపడతాడు. ఇంటర్ నేషనల్ ట్రెండ్స్ ను ఫాలో అవుతుంటాడు. అంతేకాదు నేను చేసే డిజైన్ ల విషయంలో పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఇస్తుంటాడు. షారూఖ్ నేను చేసిన డిజైన్ ఓకే చేస్తే నాకు ఏ ప్లస్ గ్రేడ్ వచ్చినట్టుగా ఫీల్ అవుతా` అని చెప్పింది.
మీరు చేసే డిజైన్స్ కు ఆయన సజెన్స్ ఇస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా..` అవును ఇక ఆయన సినిమాలు మానేసి, డిజైనింగ్ మొదలు పెట్టాలి` అంటూ సమాధానం ఇచ్చింది. అంతేకాదు తప్పకుండా ఆ రోజు వస్తుందని చెప్పింది గౌరీ ఖాన్.
మరింత సమాచారం తెలుసుకోండి: