రోజా రచ్చబండను ఆశ్రయిస్తున్న దొరబాబు దంపతులు.. అందుకేనా..?
జబర్ధస్త్ దొరబాబు.. వారం రోజుల నుంచి ఈ పేరు హాట్ టాపిక్గా మారింది. విశాఖపట్నంలో పోలీసులు చేసిన తనిఖీల్లో వ్యభిచార గృహంలో జబర్దస్త్ నటులు దొరబాబు, పరదేశీలు పట్టుబడడం అందరినీ షాక్కు గురిచేసింది. వీరితో పాటు నలుగురు మహిళలు, మరో ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. జబర్దస్త్ నుంచి నాగబాబు తప్పుకోవడంతో.. ఏడేళ్ల పాటు సక్సెస్ఫుల్ గా సాగిన ఈ షో మొన్నటిదాకా హాట్ టాపిక్గా మరింది. దీని కోలుకుంటున్న టైమ్లోనే.. దొరబాబు ఇష్యూ వైరల్ అయి జబర్దస్త్ వార్తలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి.
అయితే ఈయన అలాంటి పరిస్థితుల్లో దొరికిన తర్వాత కూడా దొరబాబు భార్య అమూల్య మాత్రం ఆయనకే అండగా నిలబడింది. ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తాయని చెప్పుకొచ్చింది. అందుకే ఎవరూ గతాన్ని మర్చిపోవద్దని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఎమ్మెల్యే, ప్రముఖ నటి రోజా జడ్జిగా నిర్వహిస్తోన్న ‘రచ్చబండ’ షోకు దొరబాబు దంపతులు వెళ్లబోతున్నారట. ఈ షో వేదికగా అమూల్య తనతో పాటు భర్త దొరబాబును ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి.. పబ్లిక్గానే క్లారిటీ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
అలాగే అలాగే.. దొరబాబు ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్న జబర్దస్త్ కమెడియన్స్తో పాటు రోజా వీరికి సపోర్ట్గా నిలవనున్నారట. అందుకే రచ్చబండ కార్యక్రమానికి పిలిచి అసలు ఆరోజు రాత్రి ఏం జరిగిందనేదానిపై ప్రేక్షకులకు క్లారిటీ ఇవ్వాలనుకున్నట్టు సమాచారం. కాగా, ఈ ఘటన అనంతరం దొరబాబు జబర్దస్త్లోకి రారని, కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఆది తీసుకువస్తాడనీ ఇలా పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, తాజాగా ప్రసారం అయిన జబర్ధస్త్ స్కిట్లో హైపర్ ఆదితో కలిసి దొరబాబు కనిపించడం అందరికీ షాక్కు గురిచేసింది. దీని బట్టీ చూస్తుంటే అటు రోజా.. ఇటు జబర్దస్త్ నటులు దొరబాబుకు బాగానే సపోర్ట్ చేస్తున్నట్టు అర్థమవుతోంది.