ఖర్మ కాలితే ఎవరైనా అంతే రష్మిక .. నివ్వేంటి ఎవరైనా ఆ పనికి ఒప్పుకోవాల్సిందే ..లేదంటే సైలెంట్ గా ఇంటికెళ్ళిపోవాలి..!

Kunchala Govind

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హిరోయిన్స్ ఎవరైనా ఉన్నారంటే పూజా హెగ్డే.. తర్వాత రష్మిక మందన్న నే. అయితే సరి లేరు నీకెవ్వరు సినిమా తర్వాత రష్మిక అనుకున్నది ఒకటి అయినది ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత ఇక నెక్స్ట్ చిరంజీవి గారితోనే అన్నంత ధీమాగా ఉంది. అందుకే సరిలేరు ఈవెంట్ లో కూడా మెగాస్టార్ ని తెగ కాకా పట్టింది. అంతేకాదు అమ్మడి ఊపు చూసి ఇక రష్మిక కి తిరుగే లేదనుకున్నారు. దానికి తగ్గట్టే అటు రష్మిక, ఇటు పూజా హెగ్డే సెట్స్ మీద ఉన్న క్రేజీ ప్రాజెక్టులలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే రష్మిక అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఒక్క సినిమాలోనే హీరోయిన్ గా నటిస్తోంది. అంతే తప్ప మరో ఆఫర్ చేతిలో లేదు. 

 

ఇక రష్మిక నితిన్ తో కలిసి నటించిన 'భీష్మ' హిట్ గా నిలిచినప్పటికీ అది ఈ అమ్మడికి ఏమాత్రం ఉపయోగపడలేదు. క్రెడిట్ మొత్తం నితిన్ కి,  డైరెక్టర్ కే వెళ్ళింది.  'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు రష్మిక సెట్ కాలేదని.. సినిమాకు మైనస్ గా మారిందనే అభిప్రాయాలు చాలామందిలో వినిపించాయి. అందుకే ఆ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు క్యూ కడతాయనుకుంటే ఎదురు చూపులు చూడాల్సి వస్తుంది ఈ కన్నడ బ్యూటి. రష్మిక చేతిలో ప్రస్తుతం అల్లు అర్జున్-సుకుమార్ సినిమా ఒక్కటే ఉండటంతో బెంబేలెత్తుతుందట. 

 

దానికి తోడు పూజా హెగ్డే కూడా రష్మిక కి రావాల్సిన కొన్ని అవకాశాలని అందిపుచ్చుకుంటుంది. ఒకరకంగా చెప్పాలంటే పూజా హెగ్డే రష్మిక అవకాశాలకి అడ్డం పడుతుందన్న టాక్ వినిపిస్తుంది. దాంతో రష్మిక కి పిచ్చెక్కుతుందట. రెమ్యూనరేషన్ తగ్గించుకుందామా అనుకుంటే అసలు అవకాశాలు రావాలిగా .. అవే లేకుండా రెమ్యూనరేషన్ తగ్గించుకుందామని నీకు నువ్వే అనుకుంటే ఎలా అంటూ కూడా కామెంట్స్ పడుతున్నాయి. దీన్నే ఖర్మ కాలడం అంటారు అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారట. ఇక బన్నీ సినిమాకి పాపం రష్మిక అనుకున్నంత రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదు. ఇదీ రష్మిక కి దెబ్బే. ఇలానే ఉంటే ఇక అన్ని సర్దుకొని ఇంటికెళ్ళి కన్నడ సినిమాలు చేసుకోవడమే అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: