మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం ఒక్క హిట్టు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాడు. అతను నటించిన గత నాలుగు సినిమాలు ఒక దానిని మించి మరొకటి డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ఆశలన్నీ క్రాక్ పైనే పెట్టుకున్నాడు. ఇటీవల ఈ సినిమా టీజర్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకొని అంచనాలను పెంచేసింది. ఇక ఇక ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండంతో ఇప్పటికే 80 శాతం కు పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో జరుగుతుంది. ఈషెడ్యూల్ లో క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరెకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది వీరితోపాటు సముద్రఖని ,చిరాగ్ జానీ ,వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. మే 8న క్రాక్ ప్రేక్షకులముందుకు రానుంది. కాగా రవితేజ-గోపిచంద్ కాంబోలో ఇంతకుముందు వచ్చిన డాన్ శీను యావరేజ్ అనిపించుకోగా బలుపు సూపర్ హిట్ అయ్యింది.
ఇక ఈసినిమా తరువాత రవితేజ ,రైడ్ ఫేమ్ రమేష్ వర్మ డైరెక్షన్ లో నటించనున్నాడు. ఏప్రిల్ నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇంతకుముందు రమేష్ వర్మ తో రవితేజ చేసిన వీర ప్లాప్ అయ్యింది అయినా కూడా మరోసారి అతనికి ఛాన్స్ ఇచ్చాడు. ఈసినిమా కాకుండా ఇటీవల రవితేజ మరో సినిమా కు గ్రీన్ సిగ్నల్ఇచ్చాడు. నాపేరు సూర్య తో డైరెక్టర్ గా మారిన వక్కంతం వంశీ డైరెక్షన్ లో రవితేజ నటించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.