రష్మికి ఒళ్లు మండిపోయిందిగా... సతీ సావిత్రిలా చేయనా...!
దీంతో రష్మి రెచ్చిపోయింది.. ఆమెకు బాగా ఒళ్లు మంటపెట్టేటా ఉన్న ఈ పోస్టు ఆమెను ఎక్కడో టచ్ చేసింది. అసలు మ్యాటర్ ఏంటంటే కరోనా వైరస్పై రష్మి ఓ పోస్టు పెట్టారు. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెట్టారు. ఓ నెటిజన్ రష్మి యాంకరింగ్ చేస్తోన్న షోతో పాటు ఆమె వేసుకున్న వస్త్రాలపై సైతం తీవ్రంగా కామెంట్ చేశారు. దీంతో కోపం ఆపుకోలేకపోయిన రష్మి చాలా ఘాటుగా రిప్లే ఇచ్చింది. మేం మీ చేతులు, కాళ్లు కట్టేసి టీవీ ముందు కూర్చోపెట్టలేదు. మీకు నచ్చనట్టు మేము డ్యాన్స్ ప్రదర్శన ఇస్తుంటే చూడకుండా కళ్లు మూసుకోండని చెప్పింది.
అంతటితో ఆగని ఆమె లేకపోతే మీ చేతిలో రిమోట్ ఉంటుంది కదా.. మీ ఛానెల్ కూడా మార్చుకోండి... లేకపోతే మీరు సినిమా ఏదైనా తీస్తుంటే అందులో సతీ సావిత్రి పాత్ర అయినా నాకు ఇవ్వండి.. అంతే కాని తాను చేసే పని గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నించాల్సిన అవసరం లేదని ఆమె కుండబద్దలు కొట్టింది. నాకు వచ్చిన అవకాశాల్లో మంచివి ఎంచుకుని మీ అందరిలాగే పనిచేస్తున్నా అని ఘాటుగా సమాధానమిచ్చింది.