రామ్ చరణ్ దెబ్బతో `ఆర్ఆర్ఆర్` ఫ్యాన్స్కు దిమ్మతిరిగిందిగా..!!
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సిరీస్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్`. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి మొదటి సారి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఇక పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అదరగొట్టనున్నాడు.
ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి ఈ సినిమా కథ గురించి మరియు హీరోయిన్ల గురించి బోలెడని వార్తలు బయటకు వచ్చాయి. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి వైరస్ ఇప్పటికే ప్రపంచంలోని 145కు పైగా దేశాల్లో పాగా వేసి వేలాదిమందికి బలిగొంది.
ఈ క్రమంలోనే రామ్ చరణ్ నేడు ఫ్యాన్స్ కి సోషల్ మీడియా ద్వారా ఓ సందేశం పంపారు. ఈనెల 27న జరగాల్సిన తన పుట్టిన రోజు వేడుకలు కరోనా కారణంగా నిర్వహించరాదని విన్నవించడం జరిగింది. అయితే రామ్ చరణ్ పంపిన విన్నపంలో ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ నిరాశపడే ఓ విషయం దాగివుంది. వాస్తవానికి రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఏదో ఒక కీలక అప్డేట్ ఉంటుందని చరణ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరియు తదితరులు ఆశించారు. కానీ, చరణ్ కరోనా కారణంగా పుట్టిన రోజు వేడుకలు రద్దు చేసుకున్న క్రమంలో ఆర్.ఆర్.ఆర్ నుండి ఊహించిన స్థాయి అప్డేట్ వచ్చే ఏ మాత్రం లేవు. ఇదే జరిగితే నిజంగా ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ నిరాశ పడక తప్పదు.