కరోనా ప్రభావంతో సెలబ్రిటీలు అంతా ఇంటికే పరిమిత మవుతున్నారు. ఖాళీ సమయం దొరకటంతో ప్రతీ ఒక్కరు తమ అభిమానులను ఎంటర్ టైన్ చేసేందుకు సోషల్ మీడియా వేదిక గా రకరకాల పోస్ట్ లు చేస్తున్నారు. కొందరు సెలబ్రిటీ అభిమానులకు కరోనా నివారణపై అవేర్ నెస్ కలిగించే ప్రయత్నం చేస్తుంటే, మరి కొందరు సరదా సరదా పోస్ట్ లు చేస్తూ అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాహో బ్యూటీ ఇల్లి అవ్రామ్ ఆసక్తికర పోస్ట్ చేసింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో షూటింగ్లు అన్ని ఆగిపోవటంతో ఇల్లి ఇంట్లో టైం పాస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాను బికినీలో ఉన్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ బ్యూటీ `బికినీ వేసుకోవాలంటే బీచ్ ఉండాలని మీతో ఎవరు అన్నారు` అంటూ కొంటెగా కామెంట్ చేసింది. ఈ ఫోటోతో పాటు బికినీ, కరోనా, స్టే హెల్దీ అనే హ్యాష్ ట్యాగ్ లను జోడించింది.
ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల మలంగ్ సినిమాలో దర్శన మిచ్చిన ఈ భామ ప్రస్తుతం హమ్ మస్తీ కరేంగే సినిమాలో నటిస్తోంది. ఈ భామ నటించిన క్వీన్ రీమేక్ పారిస్ పారిస్, బటర్ ఫ్లై సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది.