ఈ యాక్షన్ హీరోని సరికొత్తగా చూపిస్తాడట..!

Edari Rama Krishna

తెలుగు ఇండస్ట్రీలో విప్లవ చిత్రాల డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న టి. కృష్ణ తనయుడు గోపిచంద్ ‘తొలివలపు’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు.  కానీ ఈ మూవీ అనుకున్నంతగా హిట్ కాలేదు.  తర్వాత విలన్ అవతారం ఎత్తాడు.  తేజ దర్శకత్వంలో నితిన్, సదా జంటగా నటించిన ‘జయం’ చిత్రంలో విలన్ గా నటించాడు. ఆ తర్వాత వర్షం, నిజం చిత్రంలో మంచి విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరో స్థాయిలో గోపిచంద్ కి మంచి పేరు వచ్చింది.  తర్వాత హీరోగా పలు చిత్రాల్లో నటించాడు. యాక్షన్ తరహా చిత్రాలో నటించిన గోపిచంద్ ‘లౌక్యం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. 

 

ఈ చిత్రం తర్వాత సౌఖ్యం చిత్రంలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.  గత ఏడాది చాణుక్య చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు. తాజాగా  ప్రస్తుతం గోపీచంద్,  సంపత్ నంది దర్శకత్వంలో ఒక  సినిమా చేస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో యాక్షన్ ప్రధానంగా ఈ చిత్రం రూపొందుతుందని అంటున్నారు.  ఈ చిత్రం పూర్తయిన తర్వాత తేజ దర్శకత్వంలో ఓ మూవీలో నటించబోతున్నాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయనేది తాజా సమాచారం.

 

గోపీ చంద్ ని జయం, నిజం చిత్రంలో బీభత్సమైన విలన్ గా చూపించాడు దర్శకులు తేజ.  చాలా కాలం తర్వాత మరోసారి వీరిద్దరి కాంబోలో చిత్రం రాబోతుంది.  ఈ చిత్రంలో గోపిచంద్ ని సరికొత్తగా చూపించబోతున్నారట తేజ.  గతంలో వీలన్ గా ఏంత మంచి పేరు వచ్చిందో.. ఇప్పుడు హీరోగా ఆ స్థాయిలో మంచి పేరు తెచ్చుకుంటాడని తేజ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.  గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపిచంద్ మరి ఈ చిత్రంతో మంచి విజయం అందుకుంటాడా లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: