ప్రస్తుతం కరోనా ప్రభావంతో దేశంలోని ప్రజానీకం అంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్ల మీదకు రావద్దని ప్రభుత్వాలు కోరుతుండటంతో ప్రజలు గడప దాటడం లేదు. ఇప్పటికే విద్యా సంస్థలన్నీ మూత పడటంతో పిల్లలు ఇళ్లు పీకి పందిరి వేస్తున్నారు. సమ్మర్ హాలీడేస్ లోనే పిల్లలను అదుపు చేయటం కష్టమనుకుంటుంటే ఇప్పుడు చాలా ముందుగానే హాలీడేస్ ప్రకటించటంతో తల్లిదండ్రుల తల ప్రాణతోకకి వస్తుంది.
ఈ సమస్య సాధారన ప్రజానీకానికే కాదు సెలబ్రిటీలకు కూడా తప్పటం లేదు. ఈ నేపథ్యంలో స్టార్ వారసురాలు మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేసింది. `ఒక వేళ స్కూల్స్ ఎక్కువ రోజులు గనుక మూత పడితే. సైటింస్ట్ ల కన్నా ముందే తల్లి దండ్రులే ఈ మహమ్మారికి మందు కనుక్కొంటారు` అంటూ ఫన్నీగా కామెంట్ చేసింది. తన కూతురు విద్యా నిర్వాణ అల్లరి భరించలేక మంచు లక్ష్మీ ఈ పోస్ట్ చేసింది.
మోహన్ బాబు వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన మంచు లక్ష్మీ తరువాత వ్యాఖ్యతగా, నిర్మాతగా పలు రంగాల్లో సత్తా చాటింది. నటిగా మంచి గుర్తింపు వచ్చినా సక్సెస్ పెద్దగా రాకపోవటంతో ఆమెకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న లక్ష్మీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. అలాగే సినీ కార్యక్రమాల్లో ఈ జనరేషన్ హీరోయిన్లతో కలిసి సందడి చేస్తుంటుంది.
auto 12px; width: 50px;">
View this post on Instagram
True that.....hehehe #homeschooling
A post shared by
{{RelevantDataTitle}}