ప్రస్తుతం టాప్ హీరోయిన్ లిస్ట్లో పూజాహెగ్డే చేరిపోయింది. వరుస చిత్రాలతో ఫుల్ జోష్లో ముందుకు దూసుకుపోతుంది ఈ భామ. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ రెండిటిని కూడా సమానంగా ఏలేస్తుంది ఈ భామ. ఇటీవలె ‘అల.. వైకుంఠపురంలో’ చిత్రంతో మరో ఘన విజయాన్ని అందుకుంది. ఔ ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. అఖిల్కి జోడీగా ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్’ చిత్రంలోనూ చేస్తోంది. ఇదిలా ఉంటే..బాలీవుడ్లో కూడా సల్మాన్ఖాన్తో నటించే లక్కీ ఛాన్స్ని పూజా అందిపుచ్చుకోవడం ఓ విశేషం.అంతే కాక అక్షయ్ సరసన కూడా మరో చిత్రంలో ఈ భామనే అనుకుంటున్నట్లు వినికిడి. అక్షరాల నాలుగు కోట్ల రూపాయల్ని పారితోషికంగా తీసుకోవడం మరో విశేషం. దీంతో పూజా రెమ్యూనరేషన్ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వంలో సల్మాన్ఖాన్, పూజా జంటగా నటిస్తున్న చిత్రానికి ‘కభీ ఈద్ కభీ దివాలి’ అనే టైటిల్ని ఖరారు చేశారు.
గ్లామర్ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న ఈ భామ తన పాత్రలు.. ఎంపిక విషయంలో రూటు మార్చింది. లేటెస్ట్గా ఓ మహిళా ప్రధాన చిత్రంలో నటించేందుకు పచ్చా జెండా ఊపిందట. దర్శకుడు హను రాఘవపూడి చెప్పిన ఉమెన్ సెంట్రిక్ స్క్రిప్ట్ పూజాకి బాగా నచ్చిందట. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘లై’, ‘పడి పడి లేచే మనసు’ వంటి తదితర చిత్రాలతో దర్శకుడిగా హను రాఘవపూడి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హను- పూజా కాంబినేషన్లో తెరకెక్కబోయే ఈ మహిళా ప్రధాన చిత్రంపై అందరిలోనూ ఆశక్తిగా నెలకొంది.
ఇక ప్రస్తుతం స్టార్ స్టేటస్ని అనుభవిస్తుంది పూజా. తన అందచందాలతో కుర్రాళ్ళను ఆకట్టుకుంటుంది. ఇక అందాలను ఆరబోసే విషయంలో అయితే ఏమాత్రం మొహమాటం పడటంలేదు ఈ భామ గ్లామర్కు కొత్త అర్థం చెబుతోంది. బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే మాట్లాడుతూ.. తాను ఎంతో అదృష్టవంతురాలినని అంటోంది.“ఒక సినిమాలో నటించేందుకు నాకు దర్శకుడు అవకాశమిస్తే… ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాను. ఇక నేను ఈ లోకంలోకి రాకముందే నేను చేయాల్సిన పనుల గురించి ముందే నిర్ణయించి ఉంటుందని నమ్ముతాను. వాటినే నేను చేస్తున్నాను తప్ప.. ప్రత్యేకంగా నేను ఏమీ చేయడం లేదు. అంటూ వేదాంతం వల్లిస్తుంది ఈ వయ్యారి భామ.
మరింత సమాచారం తెలుసుకోండి: