శార్వారీ నామ సంవత్సరాన్ని అందరూ మర్చిపోయారు. ఉగాది సందడి అసలు ఎక్కడా కనిపించడం లేదు. ఎవరు చూసినా భయభ్రాంతులతో ఏదో అలా కాలాన్ని గడుపుతున్నారు. మరి ఆ టెన్షన్ ఏంతో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత రెండు నెలలుగా కరోనా వైరస్తో ప్రపంచవ్యాప్తంగా టెన్సన్ మొదలైంది. ఇది ఈ మధ్య ఓ 15 రోజుల నుంచి మరింత పెరిగింది. ఇంత టెన్షన్లో దర్శకధీరుడు రాజమౌళి తన కొత్త చిత్రం ఆర్.ఆర్.ఆర్ నుంచి కొన్ని నిమిషాల క్రిందటనే ఓ మోషన్ పోస్టర్ ని విడుదలచేశారు.
ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ హంగామా చేసేస్తుంది. జక్కన్న ఏది చేసినా పక్కా ప్లాన్ ప్రకారం చాలా తెలివిగా వెళుతుంటాడు. కానీ, ఈసారి ఆయన ఎక్కడో కాస్త తేడా కొట్టేశాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.. అదేంటి వనుకుంటున్నారా... ప్రపంచం అంతా భయపడుతున్న వేళ.. తన కొత్త చిత్రం అప్ డేట్ టీజర్ని విడుదల చేయడం అనేది కాస్త వివాదానికి దారితీస్తుంది.
ప్రపంచమంతా ఈ వైరస్తో అతలాకుతలం అవుతున్న సందర్భంగా ఈ పోస్టర్ విడుదల పై పెద్దగా ఏమీ స్పందన లేదు. అంటే రాజమౌళి ఈ సినిమా గురించి ఏ అప్ డేట్ అయినా సరే ప్రేక్షకుల్లో ఇటు ఫ్యాన్స్లో, అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్లో హడావిడి మాములుగా ఉండదు. ఈ సినిమా టైటిల్ రాజమౌళి ఎప్పుడెప్పుడు చెపుతాడా అని అంతటా ఆశక్తి నెలకొన్ని విషయం తెలిసిందే. ఉగాది సందర్భంగా, ఈనెల 27న రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా టైటిల్ ని ప్రకటించింది చిత్రబృందం. అయితే ఇలాంటి సమయంలో… సినిమా ప్రచారాలు అవసరమా? అనే చర్చ మొదలైంది. భయంతో ప్రపంచం వణికిపోతోంటే.. అవేం పట్టనట్టు సినిమా ప్రచారం చేసుకోవడం హర్షించదగిన విషయం కాదు. ఇటీవల ప్రపంచం అంతా వణికిపోతున్న వేళ మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూకి టాలీవుడ్ సెలబ్రిటీలు వాళ్ళు చేసే పనులు, వీడియోలు రిలీజ్ చేస్తే… రాజమౌళి ఏమీ ఆలోచించకుండా ఈ చిత్రం గురించి మీడియా ముందుకు వచ్చి ఇప్పటి వరకు వైరస్ గురించి ఒక చిన్న మెసేజ్ కూడా పంపకుండా తన పనిలో తాను బిజీగా ఉన్నాడు.
ఇప్పుడు జనాలంతా ఖాళీగా ఉన్నారని తన సినిమా గురించి, టైటిల్ గురించి మాట్లాడుకుంటారని వాళ్ళకి ఖాళీ సమయం ఇదేనని జక్కన భావించాడు. కాని విచిత్రమేమిటంటే ‘రాజమౌళి చిత్ర టైటిల్ వస్తుందిరోయ్’ అంటూ ఊగిపోయే పరిస్థితి సోషల్ మీడియాలో ఎక్కడా కూడా కనిపించ లేదు. జనాల ఆలోచనలు వేరు, అవసరాలు వేరు. ప్రస్తుతం ఉన్న టెన్షన్ వేరు దీంతో ఈ పోస్టర్ గురించి ఎవరు మాట్లాడుకుంటారు. ఏమాత్రం దీని పై స్పందిస్తారో చూద్దాం.
మరింత సమాచారం తెలుసుకోండి: