ఒక్క సినిమాతోనే సంచలనం సృష్టించిన యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతి. బోల్డ్ లవ్ స్టోరిగా తెరకెక్కిన ఆర్ ఎక్స్ 100 సినిమాతో అజయ్ భూపతి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమా ఘన విజయం సాధించటంత అజయ్ పేరు మారు మోగిపోయింది. అంతేకాదు ఈ సినిమాలో నటించిన హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ లకు కూడా మంచి పేరు వచ్చింది. దీంతో అజయ్ ఫుల్ బిజీ కావటం ఖాయమని భావించారు అంతా.
కానీ తరువాత సీన్ రివర్స్ అయ్యింది. రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అజయ్, యాటిట్యూడ్ విషయంలోనూ వర్మ స్టైల్ నే ఫాలో అయ్యాడు. తొలి సినిమా నుంచి వివాదాలకు కేంద్ర బింధువుగా మారిన అజయ్కు తరువాత రెండో అవకావం రాలేదు. ఆర్ ఎక్స్ 100 సక్సెస్ తరువాత మహా సముద్రం అనే కథను రెడీ చేసుకొని పలువురు హీరోలను సంప్రదించాడు. రవితేజ దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభం కావటం దాదాపు ఖాయం అన్న ప్రచారం జరిగింది.
కానీ చివరి నిమిషంలో రవితేజ హ్యాండిచ్చాడు. ఆ సమయంలో హీరోలను ఉద్దేశించి అజయ్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. తరువాత నాగచైతన్య హీరోగా సినిమా ప్రారంభమవుతుందన్న వార్తలు వినిపించినా అది కూడా జరగలేదు. ఫైనల్గా అజయ్ మహా సముద్రంలో నటించేందుకు శర్వానంద్ ఓకె చెప్పాడు. ప్రస్తుతం శ్రీకారం సినిమాలో నటిస్తున్న శర్వా ఈ సినిమా పూర్తయిన వెంటనే అజయ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావించాడు.
కానీ జాను సినిమా రిలీజ్ తరువాత సీన్ మారిపోయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన జాను నిరాశపరచటంతో శర్వానంద్ ఆలోచనలో పడ్డాడట. ప్రస్తుతానికి అజయ్ తెరకెక్కించబోయే మహా సముద్రం సినిమాను పక్కన పెట్టేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో అజయ్ భూపతి పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
మరింత సమాచారం తెలుసుకోండి: