కరోనా అవుట్ బ్రేక్ తో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడు బిజీ బిజీ లైఫ్లో ఉండే తారలు ఇప్పుడు ఇంటి పట్టునే ఉండే సమయం దొరకటంతో క్వాలిటీ టైం అంతా వాళ్లకు అత్యంత ఇష్టమైన పనులు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
ప్రియాంక చోప్రా, హృతిక్ రోషన్, అలియా భట్, శిల్పా శెట్టి, ట్వింకిల్ ఖన్నా లాంటి స్టార్స్ తమ సమయాన్ని ఎక్కువగా తమ చిన్నారి స్నేహితులతో కలిసి గడుపుతున్నారు. అంతేకాదు తాము క్వారెంటైన్ లో ఎలా గడుపుతున్నారో అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు స్టార్స్. కరోనా వైరస్ ప్రభావంతో దేశంలో ఆంక్షలు మొదలైన దగ్గర నుంచి ఇళ్లకే పరిమితమైన స్టార్స్ తమ పెంపుడు జంతువులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.
అంతేకాదు తమ అభిమానులు ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోషల్ మీడియా ద్వారా వివరిస్తున్నారు. గత రెండు రోజులుగా దేశంలో కరోనా ప్రభావం కాస్త తగ్గినట్టుగానే కనిపించినా నిన్న ఒక్కరోజులో పరిస్తితి మారిపోయింది. ఢిల్లీలో మత ప్రార్థనల్లో పాల్గొన్న చాలా మందికి కరోనా పాజిటివ్ రావటంతో ప్రజాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.