గేమ్ ఆప్ థ్రోన్స్ సిరీస్ లో నటించి ఆకట్టుకున్న ఎమిలియా క్లార్క్ తన అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. కరోనా మహమ్మారి భారీన పడి కష్టాలు పడుతున్న వారిని అదుకునేందుకు ఫండ్ కలెక్ట్ చేయటం కోసం ఆఫర్ ఇచ్చింది. భారీ ఎత్తున విరాళాలు ఇచ్చే వారితో డిన్నర్ డేట్ కు వస్తానంటూ ప్రకటించింది క్లార్క్. చాలా కాలంగా సేవా కార్యక్రమాల్లో ఉన్న ఆమె మెదడు సమస్యలతో బాధపడేవారికి సాయం అందిస్తోంది.
తాజాగా తన సేవా కార్యక్రమాలను కరోనాతో బాధపడేవారికి సైతం అందించనుంది. అందులో భాగంగా నేషనల్ సర్వీస్కు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. యూకేలో ప్రజల డోనేషన్స్తో నడిచే నేషనల్ హెల్త్ సర్వీస్ అనే ఆర్గనేజేషన్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా కరోనా విషయంలోనూ ఫండ్ కలెక్ట్ చేసేందుకు ముందుకు వచ్చిన క్లార్క్ తన సోషల్ మీడియా పేజ్లో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేసింది.
సోమవారం పోస్ట్ చేసిన వీడియోలో డోనేషన్స్ అందించిన వారిలో ప్రపంచ వ్యాప్తంగా 12 మందిని సెలెక్ట్ చేసి వారితో డిన్నర్ చేస్తనంటూ ప్రకటించింది. `మనం కలిసి వండుకుంటాం. మనం కలిసి తింటాం. చాలా విషయాలు చర్చించుకుంటాం. అందుకే ఐసోలేషన్ మీద కూడా ఫన్నీ వీడియోస్ చేస్తున్నాం. ఈ ప్రమాదాన్ని కూడా నవ్వుతూనే ఎదుర్కొందాం` అంటూ పోస్ట్ చేసింది.
auto 12px; width: 50px;">
View this post on Instagram
Dearest ones, from my isolation booth I write to you with a plea for help! Due to the current frightening and ever changing
{{RelevantDataTitle}}