కన్నీరుమున్నీరైన ఇలియానా.. ఆత్మీయుడ్ని కోల్పోయిన బాధలో..!

JSR
తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అయి తరువాత బాలీవుడ్ బాట పట్టిన అందాల భామ ఇలియానా. బాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవటంతో ఎక్కువ సమయం ఖాళీగా ఉంటున్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ భామ తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ భావోద్వేగం సందేశాన్ని పోస్ట్ చేసింది. తన అంకుల్‌ మరణించిన సందర్భంగా తన బాధను అభిమానులతో షేర్ చేసుకుంది ఇలియానా.

`నా దగ్గర ఇంకా కొన్ని ఫోటోలు, కొన్ని వీడియోలు, ఆడియోలు ఉంటే బాగుండనిపించింది. నా హృదయం ఇప్పటికీ నువ్వు లేవన్న నిజాన్ని నమ్మలేకపోతోంది. నాకు తెలిసిన అద్భుతమైన, గొప్ప వ్యక్తివి నువ్వు. ఈ విషయాన్ని నీతో పంచుకోవటంతో కూడా చాలా బాధగా ఉంది. నేను నిన్ను ఎంతో ప్రేమించాను. నీతో మరికొంత సమయం ఉంటే బాగుండనిపిస్తుంది.

నాకు స్వర్గం ఉందో లేదో తెలియదు. కానీ ఉంటే నువ్వు అక్కడే ఉంటావని భావిస్తున్నా. నేను చేసిన మంచి పనులు గుర్తు చేసుకుంటున్నా. ఇప్పటికీ నేను కోరుకునేది ఒకటే. రేపు ఉదయం నేను నిద్ర లేచేసరికి ఇది ఓ పీడ కల అని తెలిస్తే బాగుండు. మళ్లీ నీతో ఒక్కసరి మాట్లాడితే బాగుండూ` అంటూ తన ఆవేదనను అభిమానులతో పంచుకుంది ఇలియానా.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
I wish I had more pictures, more videos, (@ileana_official) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: