కరోనా వైరస్ మానవాళికే ప్రమాదకరంగా మారింది. దాని ఇంత వరకు సరైన చికిత్సా విధానం లేకపోవటం, వాక్సిన్ ఇంకా తయారు కాకపోవటంతో ప్రపంచ వ్యాప్తంగా మరణ మృదంగం మోగుతోంది. దీంతో ప్రపంచమంతా స్థంభించిపోయింది. మన దేశంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కరోనా భయంతో మన దేశంలో 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. దీంతో సాధారణ ప్రజానీకం నుంచి సినీ తారలు, సెలబ్రిటీలు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
ఈ నేపథ్యంలో స్టార్స్ తమ అభిమానుల కోసం వర్క్ అవుట్ వీడియోస్, ఫోటోస్ ను తమ సోషల్ మీడియా పేజ్లలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఏజ్ బార్ బ్యూటీ సుస్మితా సేన్ కూడా తన వర్క్ అవుట్ ఫోటోస్ను అభిమానులతో పంచుకుంది. అయితే అందరిలా రొటీన్ వర్క్ అవుట్ ఫోటోస్ కాకుండా కాస్త రోమాంటిక్గా ప్లాన్ చేసింది ఈ భామ. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి చేసిన వర్క్ అవుట్ ఫోటోస్ ను తన ఇన్ స్టాగ్రామ్ పేజ్లో షేర్ చేసింది.
`కష్టకాలం ఎప్పటికీ ఉండదు. ఈ సమయంలో బలంగా ఉన్నవారే ఈ విపత్తును దాటగలరు అంటూ తనదైన వేదాంతాన్ని చెప్పింది. ఈ సమయంలో ప్రజలందనూ మానసికంగా శారీరకంగా ధృడంగా తయారు కావాలంటూ పిలుపునిచ్చింది. బాలీవుడ్ బ్యూటీ సుష్మిత తన కంటే చాలా చిన్నవాడైన రోమన్షాతో కొంత కాలంగా డేటింగ్ చేస్తోంది. ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా ఒకే ఇంట్లో వరీిద్దరు కలిసి వర్క్ అవుట్స్ చేస్తున్నారు.
auto 12px; width: 50px;">
View this post on Instagram
Tough times don’t last...Tough
{{RelevantDataTitle}}