టాలీవుడ్ అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి , కింగ్ నాగార్జున తో పాటు యువ హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ల పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. కొద్దీ రోజుల క్రితం కరోనా పై అవగాహన కలిపించడానికి వీరు నలుగురు ఓ మ్యూజిక్ వీడియో చేశారు. దీనికి కోటి సంగీతం అందించాడు తాజాగా ఆ వీడియో ను చూసిన మోదీ.. చిరంజీవి , నాగార్జున ,సాయి ధరమ్ తేజ్ , వరుణ్ తేజ్ ఇంత చక్కటి సందేశాన్నిఇచ్చిన మీకు ధన్యవాదాలు.. అందరం మన ఇళ్లలోనే ఉందాం, సామజిక దూరాన్ని పాటిద్దాం, కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం అని తెలుగులో ట్వీట్ చేశారు.
ఇదిలావుంటే కరోనా విషయంలో టాలీవుడ్ నుండి వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు ఇప్పటికే కేంద్రం తోపాటు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు ప్రకటించిన సినీ ప్రముఖులు .,. సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) పేరిట ఓ సంస్థ ను ఏర్పాటు చేసి భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సీసీసీ కి 7కోట్లకు పైగా విరాళం అందినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు కరోనా పై సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ టాలీవుడ్ , మిగితా ఇండస్ట్రీ లకు ఆదర్శం గా నిలుస్తుంది.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈక్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple