మిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్లాప్ ఎరుగని దర్శకుడిగా తిరుగులేని స్టార్ ఇమేజ్ అందుకున్నాడు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకున్న కొరటాల శివ ప్రస్తుతం ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఆచార్య పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి నక్సలైట్ నాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో చిరుతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. అయితే ఈ ఖాళీ సమయంలో తన తదుపరి చిత్రం మీద దృష్టి పెట్టాడు కొరటాల శివ.
చిరు సినిమా పూర్తయిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట కొరటాల శివ. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ ఘన విజయం సాధించటంతో మరోసారి ఇదే కాంబినేషన్ను రిపీట్ చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ కూడా గతంలో కొరటాలతో మరో సినిమా చేస్తానంటూ ప్రకటించటంతో ఈ కాంబినేషన్ లో మరో సినిమా రావటం ఖాయమనిపిస్తోంది.
అయితే ఈ ప్రాజెక్ట్పై ఇప్పట్లో సెట్స్ మీదకు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర ఆర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ కానుంది. ఆ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు ఎన్టీఆర్. అంటే త్రివిక్రమ్ సినిమా కూడా పూర్తయితే గానీ కొరటాల సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదు.
మరింత సమాచారం తెలుసుకోండి: