అందుకే మెగాస్టార్ అయ్యాడు.. సాధారణ వ్యక్తిలా..!

JSR
కరోనా వైరస్ సెలబ్రిటీలను కూడా మామూలు మనుషులుగా మార్చేసింది. ఒకప్పుడు సకల భోగాలతో తులతూగిన వారంత ఇప్పుడు ఎవరి పని వారు చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రముఖుల ఇళ్లకు కూడా పనివాళ్లు రావకపోవటంతో వాళ్లే స్వయంగా పనిచేసుకుంటున్నారు. ఈ లిస్ట్‌లో మెగాస్టార్ కూడా చేరిపోయాడు. ప్రస్తుతం క్వారెంటైన్‌లో భాగంగా ఇంటికే పరిమితమైన చిరు, ఇంటి పనుల్లో మునిగిపోయాడు.

అభిమానుల్లో కరోనాపై అవగాహన కలిగించేందుకు తన వంతుగా ప్రయత్నం చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి,  తొటమాలిగా మారాడు. కరోనా కారణంగా ఇంట్లోనే ఉండటంతో చెట్లకు నీళ్లు పోస్తూ ఆ వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అందరూ అలా ఇంటి పనుల్లో సాయం చేయాలంటూ అభిమానులకు మెసేజ్ ఇచ్చాడు చిరు. అంతేకాదు తానే స్వయంగా ఇంటి ముందు స్థలాన్నీ క్లీన్ చేస్తూ కనిపించాడు. దీంతో అభిమానులుకు చాలా మందికి ఆదర్శంగా నిలిచాడు మెగాస్టార్.

చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మెగాస్టార్ నక్సలైట్‌ పాత్రో నటిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా లాక్ డౌన్‌ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
“ మొక్కే కదా అని వదిలేస్తే, ... ... " my duty every morning #21daylockdown #StayHomeStaySafe

A post shared by {{RelevantDataTitle}}