చాలా రోజుల తరువాత రవితేజ సినిమాకు...
కిక్ నుండి మాస్ మహారాజ్ రవితేజ కు ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిపోయాడు థమన్. ఈ సినిమా తరువాత ఎక్కువగా రవితేజ , థమన్నే సంగీత దర్శకుడిగా పెట్టుకున్నాడు. థమన్ కూడా ఆ నమ్మకాన్ని చాలా సార్లు నిలబెట్టుకున్నాడు. అయితే ఈ సారి మాత్రం థమన్ కాకుండా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ లైన్లోకి వచ్చాడు. రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ తో రవితేజ రెండో సారి సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి దేవి సంగీతం అందించనున్నాడని సమాచారం. గతంలో రవితేజకు దేవి... వెంకీ , భద్ర ,సారొచ్చారు వంటి మ్యూజికల్ హిట్లు ఇచ్చాడు మరి ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందో చూడాలి.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లోవున్న ఈ చిత్రం జూన్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. సత్యనారాయణ కోనేరు , హవీష్ కోనేరు నిర్మించనున్న ఈ చిత్రం ఈఏడాది చివర్లో విడుదలకానుంది.