మరోసారి పెద్ద మనసు చాటుకున్న హీరో... శభాష్ అంటున్న నెటిజన్లు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయం పట్టుకుంది. ఎటు చూసిన కూడా కరోనా మాటనే వినపడుతుంది..రోజు రోజు కూ కరోనా వల్ల చాలా మంది మృత్యువాత పడుతున్నారు.. మరీ కొందరు మాత్రం కరోనా కారణంగా క్వారంటైన్ లో బాధపడుతున్నారు.. ఇకపోతే కరోనా కట్టడి లో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ పేరుతో ప్రజలను ఇళ్లకే పరిమితం అయ్యేలా చేసింది.. అయినా కూడా కరోనా ప్రభావం ఎక్కడా తగ్గలేదు..
కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది .. దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు .
కరోనా మహమ్మారిని ఇంట్లోనే ఉంటూ కట్టడి చేయాలని చాలా మంది అనుకుంటున్నారు..అయితే ఈ మేరకు సినీ ప్రముఖులు కూడా అభిమానులకు సూచనలు ఇస్తూ ప్రజలను ఆకర్షించడానికి సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తున్నారు.. అయితే లాక్ డౌన్ తప్పక పాటిస్తే ఎటువంటి భాధలు ఉండవని తెలియ పరుస్తున్నారు..
టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ కార్మికులను ఆదుకోవడానికి చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే..ఈ సీసీసీ కి ఇప్పటికే చాలా మంది విరాళాన్ని అందించారు.. తాజాగా హీరో గోపి చంద్ 10 విరాళాన్ని ప్రకటించడంతో పాటుగా రెండు వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేశారు.. అలాగే రెండు నెలల పాటు 1500 మంది అనాథలకు అన్నదానం చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు..ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవ్వడంతో పాటుగా అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది..
Macho star @YoursGopichand donated 10 lakhs to #CoronaCrisisCharity. He is sponsoring daily food to an orphanage consisting of 1500 members for 2 months.
Already distributed daily needs and groceries to 2000 families.#IndiaFightsCoronavirus #StayHomeStaySafe pic.twitter.com/VIhvWlSGvo — BARaju (@baraju_SuperHit) April 22, 2020