ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ మల్లీస్టారర్ ప్లాన్ చేసిన టాప్ డైరెక్టర్....?
టాలీవుడ్ జనాలు ఏళ్లకు ఏళ్లుగా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తోన్న కాంబినేషన్లలో నందమూరి సోదరులు అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ కాంబినేషన్ అని చెప్పాలి. ఎన్టీఆర్ 2001లో నిన్న చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కళ్యాణ్ రామ్ కాస్త ఆలస్యంగా తొలిచూపులోనే సినిమాతో హీరో అయ్యాడు. కెరీర్ స్టార్టింగ్లో అనే క కారణాల వల్ల ఈ అన్నదమ్ములు ఇద్దరూ కలుసుకోలేక పోయారు. అయితే చాలా యేళ్ల తర్వాత ఇప్పుడు వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఇందుకు కుటుంబ పరమైన విబేధాలు.. రాజకీయ పరంగా వీరిని నందమూరి , నారా కుటుంబాలు పక్కన పెట్టడం ఇలా చాలానే కారణాలు ఉన్నాయి.
ఇక కళ్యాణ్ రామ్ నిర్మాతగా అప్పుల్లో కూరుకుపోయాడు. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ డిస్ట్రిబ్యూటర్లకు పదేళ్లుగా ఉన్న అప్పులు అన్నింటిని ఎన్టీఆర్ జై లవకుశ సినిమా చేసి తీర్చేశాడు. ఆ సినిమా దెబ్బతో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ను కష్టాల నుంచి పూర్తిగా బయట పడేశాడు. అప్పటి నుంచి కళ్యాణ్ రామ్ మంచి కథాంశం ఉన్న సినిమాలతో పాటు లో బడ్జెట్, తన మార్కెట్కు తగిన సినిమాలే చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఇక ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి సినిమా చేయాలని ప్రతి ఒక్కు కోరుకుంటున్నారు.
దర్శకుడు బోయపాటి శీను ఎన్టీఆర్తో దమ్ము సినిమా తీశాక డిజప్పాయింట్ అయ్యాడు. ఆ సినిమా అంచనాలు అందుకోలేదన్న టాక్ ఉంది. అయితే అప్పటి నుంచి మళ్లీ ఎన్టీఆర్తో ఓ సినిమా చేసి హిట్ ఇవ్వాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సారి ఎన్టీఆర్తో సినిమా అంటూ చేస్తూ బ్లాక్ బస్టరే ఇవ్వాలని అనుకుంటున్నాడట. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్తో మల్టీస్టారర్ తీసేలా ఓ కథ రెడీ చేసుకుని ఎన్టీఆర్కు గతంలోనే వినిపించాడట. అయితే అప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా పట్టాలెక్క లేదు. మళ్లీ ఎప్పటకి అయినా ఈ ఇద్దరు అన్నదమ్ముల మల్టీస్టారర్ పట్టాలెక్కుతుందో ? చూడాలి.