టాలీవుడ్ యాంకర్లలో మోస్ట్ లీడ్ లో ఉన్న యాంకర్ అనసూయ భరద్వాజ్. ఆమె యాంకర్గానే కాకుండా మంచి నటిగా కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ఈ మధ్య ఆమె నటించే పాత్రలన్నీ కూడా చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తోంది. సుకుమార్ లాంటి దర్శకులు అనసూయను నమ్మి మంచి పాత్రలే ఆఫర్ చేస్తున్నారు. అలాగే అనసూయకు ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ చాలానే ఉందని చెప్పాలి. పివిపి లాంటి వారు ఆమెకు సపోర్ట్గా ఉన్నట్లు ఆమధ్య కొన్ని గుసగుసలు కూడా వినిపించాయి. అలాగే ఈటీవీ మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి నుంచి కూడా గట్టి సపోర్ట్ గా ఉంది. అలాగే నాగబాబు సపోర్ట్ కూడా ఉంది. ఇక అనసూయని చాలా ఫ్రెండ్లీ నేచర్ కావడంతో అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు.
ఈమె ఇటీవల సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటుంది.ఈ మధ్యే చేసిన లైవ్ ఛాట్లో ఓ అభిమాని ఇప్పటి వరకు తెలుగులో మీకు ఛాలెంజింగ్గా అనిపించిన పాత్ర ఏంటి అని అడిగాడు.. దీనికి చాలా మంది రంగమ్మత్త సమాధానంగా వస్తుందని అనుకున్నారు.. కానీ ఈమె చిత్రంగా ఇప్పటి వరకు తనకు తెలుగులో ఛాలెంజింగ్ రోల్ ఇచ్చిన వాళ్లే లేరంటూ సమాధానమిచ్చింది. దీని పై కొందరు అనసూయ పై సెటైర్లు కూడా వేస్తున్నారు. ఎందుకంటే దర్శకులు ఆమెకు అంత మంచి పాత్రలు ఇస్తుంటే ఆమె వాటి గురించి కనీసం చెప్పడం కూడా లేదు.
ఇక మరికొందరు రంగమ్మత్త పాత్ర మీకు ఛాలెంజింగ్గా అనిపించలేదా అంటే దానికి ఆమె అంత ఈజీగా చేసారా అంటూ సుకుమార్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. మిమ్మల్ని నమ్మి అంత మంచి పాత్ర ఇస్తే దాన్ని కూడా మీరు ఛాలెంజింగ్ అనుకోలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు ఈ భామను. రంగమ్మత్త పాత్ర తనకు పేరు తీసుకొచ్చినా కూడా.. తను అనుకున్నంత ఛాలెంజింగ్ కాదని ఫీల్ అవుతుంది అనసూయ.
అలాంటి పాత్రల కోసమే వేచి చూస్తున్నట్లు చెప్పింది. అంతేకాదు.. మిస్సమ్మ, అరుంధతి, కర్తవ్యం ఈ మూడు సినిమాల్లో రీమేక్ చేయాల్సి వస్తే ఏది చేస్తారని అడిగితే.. తాను రీమేక్ సినిమాలకు దూరమని చెప్పింది. ఒకవేళ చేయాల్సి వస్తే మాత్రం మూడు చేస్తానంటుంది అనసూయ భరద్వాజ్. ఎంతైనా తన గురించి తాను కాస్త ఎక్కువగానే ఫీలవుతుంది అనసూయ.
మరింత సమాచారం తెలుసుకోండి: