నక్షత్రం తరువాత చాలా గ్యాప్ తీసుకొన్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం రంగమార్తాండ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గత ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. మరాఠి సూపర్ హిట్ మూవీ నట సామ్రాట్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ , నానా పటేకర్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే తాజాగా మిగిలిన వారి పాత్రల విషయంలో కూడా చిన్న లీక్ దొరికింది.
ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ సతీమణిగా రమ్యకృష్ణ నటిస్తుండగా బిగ్ బాస్ 3 ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్ అతనికి అల్లుడుగా కనిపించనున్నాడు అలాగే జీవితా రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక ,ప్రకాష్ రాజ్ కూతురుగా నటిస్తుండగా కామెడీ బ్రహ్మ బ్రహ్మనందం అతనికి క్లోజ్ ఫ్రెండ్ గా కనిపించనున్నాడట. ఈ పాత్రల నడుమ జరిగే సంఘర్షణే ఈ సినిమా కథ. వీరితోపాటు అనసూయ , అలీ రెజా తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. రెడ్ బుల్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై అభిషేక్ జ్వకర్ , మధు కలిపు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈఏడాది ద్వితీయార్థంలో విడుదలకానుంది.
ఇక నక్షత్రం తో దారుణమైన ఫలితాన్ని చవిచూసిన కృష్ణ వంశీకి రంగమార్తాండ విజయం కీలకం కానుంది. మూడేళ్ళ క్రితం యువ హీరో లు సందీప్ కిషన్ ,సాయి ధరమ్ తేజ్ లతో తెరకెక్కించిన నక్షత్రం ,కృష్ణవంశీ కి చేదు జ్ఞాపకంగా మిగిలింది. ఈసినిమా దారుణమైన పరాభవాన్ని పొందింది. మరి ఇప్పుడు రంగమార్తాండ తో నైనా హిట్ కొట్టి కృష్ణ వంశీ ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.