దగ్గుపాటి రానాతో మెగాస్టార్ మల్టీ స్టారర్ చేయబోతున్నరా ...?

Suma Kallamadi

 

 

తాజాగా తెలుగు ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమా బాగా ట్రేండింగ్ కొనసాగుతుంది. ఈ ట్రెండింగ్ ఇప్పటి నుంచే కాదు ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచే కొనసాగుతుంది. ఇక ఆ తర్వాత తరంలో మళ్లీ మహేష్, వెంకటేష్ కలిసి మల్టి స్టార్స్ కలిసి తీసిన " సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమాతో ప్రేక్షకులను బాగా అలరించారు. ఇకపోతే, ఆ తర్వాత వెంకటేష్ - రామ్, వెంకటేష్ - వరుణ్ తేజ్, వెంకటేష్ - పవన్ కళ్యాణ్... ఇలా కాంబినేషన్స్ లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమా చేసేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే టాలీవుడ్ జక్కన్న దర్శకత్వంలో ఆర్. ఆర్. ఆర్ చిత్రం లో జూ. ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నటిస్తున్న సంగతి కూడా అందరికి తెలిసిందే.


ఇక తాజాగా చిరు - దగ్గుపాటి రానాతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుగు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. బాబి రాసిన కథలో ఇద్దరు హీరోలకు ప్రాముఖ్యత ఉండగా... చిరుకి లీడ్ రోల్ పోషిస్తున్నారని.. రెండో హీరోగా రానా కనిపిస్తారని... వార్తలు చెక్కర్లు కొడుతుంది. రానా చాలా సంవత్సరాలుగా చిరుతో కలిసి నటించాలని కోరిక ఉండగా అది ఇప్పుడు తీరబోతున్నట్లు అర్థమవుతుంది. 

ఇక తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో చిరు చేస్తున్న సినిమా ఆచార్య. ఆ సినిమా అనంతరం సుజిత్ దర్శకత్వంలో లూసిఫర్ సినిమాను రీమేక్ గా ఒక సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా మోహర్ రమేష్ తో కలిసి, అలాగే కొంత మంది యంగ్ దర్శకులతో కలిసి చిరంజీవి సినిమా తీసేందుకు ఆసక్తి చూపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: