అమరవీరుల స్థూపం వద్ద నక్సలైట్ గా మారిన సాయి పల్లవి..?
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్ లు వున్నప్పటికీ సాయి పల్లవి కి ఉన్న క్రేజ్ మాత్రం ప్రత్యేకం . అందరూ హీరోయిన్లు అందాల ఆరబోతకు ఇంపార్టెంట్ ఇస్తుంటే సాయిపల్లవి మాత్రం నటనకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తుంది. అవకాశాలు వచ్చినా రాకున్నా వైవిధ్యమైన పాత్రలు మాత్రమే చేసుకుంటూ పోతుంది సాయి పల్లవి. సాయిపల్లవి నటించిన అన్ని సినిమాల్లో పాత్రలతో తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఫిదా చేసింది. ముఖ్యంగా ఫిదా సినిమా తో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు ... ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన పాత్రల తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది . ఎలాంటి పాత్రలో అయిన పాత్రలో ఒదిగిపోయి మరి నటిస్తూ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటుంది .
దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమా తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి మరోసారి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరి సినిమా తో మ్యాజిక్ చేసేందుకు సిద్ధమవుతోంది.ఇదే సమయంలో రానా సరసన కూడా నటిస్తూ విరాట పర్వము అనే సినిమాలో ఓ విభిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 1980 నేపథ్యంలో సాగే ఈ పిరియాడికల్ మూవీ లో సాయి పల్లవి విభిన్నంగా కనిపించబోతుంది. ఈ సినిమాలో రానా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.
ఈ సినిమాలో సాయి పల్లవి ఒక నక్సలైట్ పాత్రలో లేదా ఒక పాత్రికేయురాలు పాత్రలో కనిపించనున్నట్లు తాజాగా విరాటపర్వం నుంచి సాయి పల్లవి కి సంబంధించి విడుదలైన మొదటి పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. అమరవీరుల స్థూపం దగ్గర సాయి పల్లవి కూర్చొని ఉంది ఈ ఫస్ట్ లుక్ లో. ఈ ఫోటోలు సాయి పల్లవి పక్కన ఒక బ్యాగ్ ఉండగా ఆమె దగ్గర కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అనేది సినిమాలో క్లారిటీ రానుంది.ఇక నాగచైతన్య సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ పై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.