ప్రభాస్కు - సుక్కుకూ అక్కడే తేడా వచ్చిందా...!
టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా కోసం టాలీవుడ్ సినిమా అభిమానులు అందరూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న యంగ్ స్టార్ హీరోల లో ఏ హీరో సినిమా అయినా రిలీజ్ అవుతుంది అంటే ఆ హీరోల అభిమానులు మాత్రమే ఫస్ట్ షో చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే ప్రభాస్ సినిమా వస్తుందంటే అందరి హీరోల అభిమానులు అర్ధరాత్రి నుంచే థియేటర్ల దగ్గర పడిగాపులు వస్తుంటారు. అలాంటి తిరుగులేని క్రేజ్ ప్రభాస్ సొంతం చేసుకున్నాడు.
ఇక మిర్చి సినిమా నుంచి ప్రభాస్ క్రేజ్, రేంజ్ ఎలా ఎదిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఎక్కడికో వెళ్ళిపోయాడు.. ప్రభాస్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ హీరో అయిపోయాడు. సాహో సినిమా తెలుగులో ప్లాప్ అయినా బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు ఏకంగా నూట యాభై కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పడు ప్రభాస్ సినిమా వస్తుంది అంటే అది ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమా అవుతోంది.
అయితే ప్రభాస్ సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఓ బ్లాక్ బస్టర్ మిస్ అయ్యాడట. బన్నీతో తీసిన ఆర్య కథను సుకుమార్ ముందుగా ప్రభాస్కు వినిపించాడట. దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా చేయాలని అనుకున్నారట. ఆ తర్వాత రవితేజ, నితిన్ను కూడా కలిశాడట. చివరకు వాళ్లకు కూడా ఆ కథ కనెక్ట్ కాకపోవడంతో చివరకు సుకుమార్ ఆ కథను బన్నీతో తీసి సూపర్ హిట్ కొట్టాడు.
ఆ కథ టైంలోనే సుకుమార్ క్రియేటివిటి ప్రభాస్కు ఎక్కకపోవడంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య మళ్లీ సినిమా సెట్ కాలేదు. ఇక బాహుబలి తర్వాత అయినా సుకుమార్ - ప్రభాస్ కాంబోలో సినిమా కోసం చాలా మంది వెయిట్ చేశారు. అయితే ప్రభాస్ ఆలోచనలు ఇప్పుడు అన్ని వేరేగా ఉన్నాయి. దీంతో సుక్కు చివరకు బన్నీతో పుష్పకు కమిట్ అయ్యాడు.