ఇంటివాడైన జబర్దస్త్ కమెడియన్...!

జబర్ధస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకొని నటుడిగా మారిన మహేష్ ఆచంట వివాహం చేసుకున్నారు. మహేష్, పావనిల వివాహం నేడు తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండల పరిధిలోని శివకోడు గ్రామంలో జరిగింది. నిన్న ఉదయం 6:31 నిమిషాల ముహూర్తానికి మహేష్… పావని మెడలో తాళి కట్టాడు. తన దగ్గరి బంధువుల అమ్మాయి పావనికు మూడు ముళ్ళు వేసాడు. లాక్ డౌన్ నిబంధల కారణంగా ఈ వివాహానికి కేవలం వధూవరుల తల్లితండ్రులు, సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తుంది. ఇప్పడు వారి పెళ్ళికి సంబందించిన ఫోటోలు బయటకి వచ్చాయి. 

 

జబర్దస్త్ కామెడీ షో నుంచి పరిచయమైన ఎంతో మంది నటుల్లో మహేష్ కూడా ఒకడు. మహేష్ ఆచంట అంటే గుర్తుపట్టకపోయినా.. 'జబర్దస్త్' మహేష్ లేదా 'రంగస్థలం'లో చిట్టిబాబు అసిస్టెంట్‌ అనగానే ఇట్టే గుర్తుపడతారు జనాలు. ప‌ట్టుద‌ల ఆత్మ‌విశ్వాసంతో అనుకున్నది సాధించాడు మ‌హేశ్. ఇప్పుడు వెండితెర‌పై త‌న‌కంటూ ఓ సెప‌రేట్ ఐడెంటీని క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు సినిమాల్లో కూడా మంచి మంచి పాత్రలు చేస్తూ క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా 'శతమానం భవతి' చిత్రంతో ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. ఆ తర్వాత 'రంగస్థలం' చిత్రంతో మనోడి దశ మారిపోయింది. అప్పటి వరకు 'జబర్దస్త్ మహేష్' అనేవాళ్లు కాస్తా ఆ తర్వాత 'రంగస్థలం' మహేష్ అంటున్నారు. ఆ సినిమాలో రామ్ చరణ్ అసిస్టెంట్‌ గా కామెడీతో పాటు ఎమోషన్ కూడా పండించాడు మహేష్.

 

'మహానటి'లో కూడా సత్యం పాత్రలో మెప్పించాడు. విలన్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ నటించాడు మహేష్. 'మహానటి' తర్వాత కార్తికేయ హీరోగా వచ్చిన 'గుణ 369'లో నెగిటివ్ రోల్ చేసాడు. ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న మహేష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడని.. తన దగ్గరి బంధువుల అమ్మాయి మెడ‌లో త్వ‌ర‌లో మూడు ముళ్లు వేయ‌బోతున్నా ఈ మధ్య వార్తలు వచ్చాయి. తాజాగా మహేష్, పావనిల వివాహం జరిగింది. మహేష్ ఆచంటకి శుభాకాంక్షలు తెలుపుతూ పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్ మ‌రింత స‌క్సెస్ కావాల‌ని ఏపీ హెరాల్డ్.కామ్ కోరుకుంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: