అల్లు అర్జున్తో హరీష్శంకర్కు కౌంటర్ వేయించిన బండ్ల...!
నిర్మాత బండ్ల గణేష్, దర్శకుడు హరీష్ శంకర్ మధ్య ట్విట్టర్ వార్ రోజు రోజుకు ముదిరి పాకాన పడుతోంది. ఈ విషయాన్ని ఎవరికి వారు లైట్ తీస్కొని ఉంటే సరిపోయేది. కానీ బండ్ల గణేష్ పదే పదే ట్వీట్లు పెడుతూ హరీష్ శంకర్ ను కవ్వించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా రెండు ట్విట్లతో బండ్ల హరీష్ శంకర్ ను మరోసారి టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. బండ్ల ముందుగా తింటున్నంత సేపు ‘ఇస్తరాకు’ అంటారు.. తిన్నాక ‘ఎంగిలి’ ఆకు అంటారు. అంటే నీతో అవసరం ఉన్నంతసేపు.. వరుసలు కలిపి మాట్లాడతారు.. అవసరం తీరాక లేని మాటలు అంటకడుతారు..’’ అంటూ ట్వీట్ చేశారు.
బండ్ల వేసిన ఈ ట్వీట్ హరీష్ శంకర్ కే అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇక ఈ గొడవ పూర్వాపరాలు పరిశీలిస్తే గబ్బర్ సింగ్ వైభవాన్ని ప్రస్తావిస్తూ దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేసిన లేఖలో ముందుగా బండ్ల గణేష్ పేరు లేదు. తర్వాత హరీష్ మరో ట్వీట్లో గణేష్ పేరు మరిచిపోయానని చెబుతూ.. బ్లాక్బస్టర్ నిర్మాత అంటూ బండ్ల గురించి తెలిపాడు. హరీష్ ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టానని అనుకున్నా గణేష్ మాత్రం దీనిని వదిలేలా లేడు.
కష్టకాలంలో ఉన్న హరీష్కు తాను అవకాశం ఇచ్చానన్నట్టుగా బండ్ల చెప్పుకొచ్చాడు. దీనిపై హరీష్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తాను గబ్బర్సింగ్ సినిమాను ముందుగా నాగబాబు గారు నిర్మాతగా చేయాలని.. అయితే పవన్ కళ్యాన్ గారు అప్పటికే బండ్ల గణేష్తో సినిమా చేసేందుకు కమిట్ అయ్యి ఉండడంతో చివరకు బండ్ల గణేష్ గారి బ్యానర్లో ఈ సినిమా చేశామని చెప్పారు. ఇక ఈ వివాదానికి మరింత కొనసాగింపు అన్నట్టుగా బండ్ల గణేష్ ఇద్దరమ్మాయిలతో సినిమా టీం అల్లు అర్జున్, పూరీ జగన్నాథ్ వీళ్లంతా ఉన్న ఫొటో పోస్ట్ చేశారు. ఈ సినిమా హిట్ అని పెట్టారు.. అంటే నువ్వు తీసిన గబ్బర్ సింగ్ మాత్రమే కాదు.. ఇది కూడా హిట్ అన్నట్టుగా మళ్లీ హరీష్ శంకర్ను టార్గెట్గా చేసుకుని బండ్ల ట్వీట్ చేశారన్న చర్చలు నడుస్తున్నాయి.
Iddarammayilatho hit 👌@alluarjun @purijagan pic.twitter.com/WpivKM5GIb — BANDLA GANESH (@ganeshbandla) May 15, 2020
🏹🏹🏹😎 pic.twitter.com/gNLE9sSkVu — BANDLA GANESH (@ganeshbandla) May 14, 2020