టాలీవుడ్ హీరోలు ఆ దర్శకుడిగా పేరు చెపితేనే వణికిపోతారు. ఆ స్థాయిలో డిజాస్టర్లను ఇచ్చాడు ఆ డైరెక్టర్. టాప్ స్టార్లను సినిమాలకు ఒప్పించే టాలెంట్ ఉన్న ఆ డైరెక్టర్ ప్రేక్షకులను మెప్పించటంలో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఆ దర్శకుడే మెహర్ రమేష్. కన్నడలో దర్శకుడిగా పరిచయం అయిన రమేష్ అక్కడ ఆంధ్రవాలా, ఒక్కడు సినిమాలను రీమేక్ చేసి కాస్త పరవాలేదనిపించాడు. కానీ టాలీవుడ్ లో మాత్రం దారుణమైన రిజల్ట్స్ను చవిచూశాడు మెహర్ రమేష్.
2008లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన కంత్రి సినిమాతో టాలీవుడ్కు దర్శకుడిగా పరిచయం అయ్యాడు మెహర్ రమేష్ ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. అయితే రమేష్ టేకింగ్ స్టైలిష్ గా ఉందన్న పేరు వచ్చింది. దీంతో ప్రభాస్ బిల్లా సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు రమేష్. తమిళ చిత్రాన్ని యాజిటీజ్గా రీమేక్ చేసినా మెహర్కు కాలం కలిసి రాలేదు. బిల్లా కూడా డిజాస్టర్ అయ్యింది. ఆ తరువాత మరోసారి ఎన్టీఆర్ హీరోగా శక్తి సినిమా చేశాడు. మగధీర మేనియాలో ఉన్న ఇండస్ట్రీకి శక్తి మరో భారీ సక్సెస్ అవుతుందని భావించారు అంతా.
కానీ శక్తి రిలీజ్ తరువాత పరిస్థితులు మారిపోయాయి. ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది శక్తి. దీంతో మెహర్ రమేష్ పేరు చెపితేనే హీరోలు భయపడే పరిస్థితి వచ్చింది. ఆ తరువాత కూడా సీనియర్ హీరో వెంకటేష్ మరోసారి రిస్క్ చేశాడు. మెహర్ దర్శకత్వంలో షాడో సినిమా చేశాడు. ఈ సినిమాతో మెహర్ రమేష్ ను ఇండస్ట్రీ పూర్తిగా పక్కన పెట్టేసింది. వెంకటేష్ స్థాయి హీరో దొరికితే కూడా కనీసం ఓకె అనిపించే సినిమా కూడా చేయలేకపోయాడు మెహర్ రమేష్. అయితే తాజాగా చిరంజీవి మెహర్ రమేష్తో చర్చలు జరుగుతున్నాయని చెప్పటంతో మెగా అభిమానుల్లో కలవరం మొదలైంది.
మరింత సమాచారం తెలుసుకోండి: