భరత్ అనే నేను దగ్గర్నుండి వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అందులో భాగంగా ఇటీవల సరిలేరు నీకెవ్వరు తో ప్రేక్షకుల ముందుకు రాగ ఆసినిమా 100కోట్ల క్లబ్ లో చేరడమే కాకుండా టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానం లో నిలిచింది. ఈసినిమా తరువాత మహేష్ , గీత గోవిందం ఫేమ్ పరశురామ్ తో తన 27వ సినిమా చేయనున్నాడు. మహేష్ తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా మే 31న ఈసినిమా లాంఛ్ కానుందని సమాచారం అయితే ఈసినిమాకు గోపి సుందర్ సంగీతం అందించనున్నాడని వార్తలు వచ్చాయి కానీ తాజాగా థమన్ ను తీసుకున్నారని తెలుస్తుంది. సినిమా లాంచింగ్ రోజు మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో క్లారిటీ రానుంది. ఇంతకుముందు థమన్ , మహేష్ బాబు నటించిన దూకుడు , బిజినెస్ మెన్ , ఆగడు చిత్రాలకు సంగీతం అందించగా ఆమూడు కూడా మ్యూజికల్ హిట్లు గా నిలిచాయి.
కాగా మహేష్ 27ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా జులై లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు వున్నాయి. ప్రస్తుతం ఈసినిమా కోసం హీరోయిన్ ను వెతికే పనిలో వున్నారు మేకర్స్. మహేష్ కుజోడిగా ఓ కొత్త అమ్మాయిని తీసుకొనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈసినిమా థియేటర్లలోకి రానుంది. ఇక గీత గోవిందం తో 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పరుశురాం దాదాపు రెండేళ్ల తరువాత మళ్ళీ మెగాఫోన్ పట్టనున్నాడు. మహేష్ తో సినిమా ను పూర్తి చేసి పరశురాం ఆతరువాత నాగ చైతన్య తో సినిమా చేయనున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట ఈసినిమా ను నిర్మించనున్నారు.