నిర్మాతలకు పవన్ చెప్పేసాడా...?
ఈ రెండు మూడు సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కేజీఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ ఒక్క సారిగా నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయిపోయాడు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. తాను మరో రెండేళ్ళు మాత్రమే సినిమా చేస్తా అని తాను ఎక్కువ కాలం సినిమాలు చేసే అవకాశం లేదని ఆయన చెప్పారట. తాను వచ్చే ఎన్నికలకు సిద్దం కావాలని 2022 వరకు మాత్రమే చేస్తా అని నిర్మాతలకు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు సమాచారం. తనకు అడ్వాన్స్ ఇవ్వాలి అనుకున్న వాళ్లకు కూడా ఆయన ఇదే విషయాన్ని చెప్పినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ప్రస్తుతం పవన్ చేస్తోన్న వకీల్ సాబ్ షూటింగ్ త్వరలోనే ఫినిష్ కానుంది. ప్రస్తుత౦ పవన్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ సినిమాల తర్వాత ఆయన రాజకీయాల్లోకి మళ్ళీ వెళ్ళే అవకాశం ఉందని టాక్ వినపడుతుంది. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్రిష్ తో కూడా చెప్పాడు అని తనతో సినిమా పూర్తి చేసుకుంటే మంచిది అని చెప్పినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం క్రిష్ పవన్ తో సినిమాను మొదలుపెట్టారు కూడా.