#SSMB 27 అఫిషియల్ అనౌన్స్మెంట్ పోస్టర్ లోనే టైటిల్ చెప్పేశారా...?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ప్రారంభంలో 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే ఈ సినిమా విడుదలై నాలుగు నెలలు దాటిపోయినా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మహేష్ ఆఫీసియల్ గా ప్రకటించలేదు. మహేష్ నెక్స్ట్ సినిమా అప్డేట్ కోసం ఆయన అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. నిజానికి మహేష్ 'సరిలేరు నీకెవ్వరూ' రిలీజైన వెంటనే తన నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేస్తాడని అందరూ భావించారు. కానీ దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన కుదరలేదు. అయితే మహేష్ తన కెరీర్లో 27వ చిత్రాన్ని 'గీత గోవిందం' డైరెక్టర్ పరశురామ్ తో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా మహేష్ తన తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ మే 31న ఈ సినిమా అఫీసియల్ గా ప్రారంభిస్తారని న్యూస్ వస్తోంది. అయితే ఇప్పుడు ఈ వార్తలన్నిటినీ నిజం చేస్తూ #SSMB అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. నాలుగున్నర నెలల నుండి ఊరించి మహేష్ బాబు తన కెరీర్లో 27వ చిత్రానికి సంభందించిన అఫీసియల్ పోస్టర్ రిలీజ్ చేసాడు.

 

'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి డైరెక్షన్ వహించబోతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మించబోతున్నారు. ఇప్పటి దాకా చెప్తున్నట్లే ఈ సినిమా మహేష్ బాబు తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా మే 31న ఉదయం 9 గంటల 9 నిమిషాలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాబోతోందని అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ఈ సినిమాకి ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న 'సర్కార్ వారి పాట' టైటిల్ నిజమనే విధంగా ఈ పోస్టర్ డిజైన్ ఉంది. ఒక టేబుల్ మీద పెన్ను మరియు ప్రభుత్వ సీల్ వేసి ఉన్న ఒక పేపర్.. అధికారిక ముద్ర ఉన్నాయి. దీనిని బట్టి ఈ సినిమా టైటిల్ 'సర్కార్ వారి పాట' అని నిర్ధారించుకోవచ్చని సూపర్ స్టార్ అభిమానులు అంటున్నారు. రేపు ఈ సినిమాకి సంభందించి పూర్తి వివరాలు తెలియనున్నాయి. 

 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
#Repost • @mbofficialteam #SSMB27 Official Announcement 🥁 You've been hearing a lot about it, countdown begins to see the REAL thing 😊 31st May - 9.09 AM 🌠 Super ⭐ @urstrulymahesh @parasurampetla @mythriofficial @gmbents @14reelsplus

A post shared by {{RelevantDataTitle}}