'బుట్టబొమ్మ' అక్కినేని ఫ్యామిలీకి దూరం కానుందా...?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అక్కినేని సమంత - బుట్ట బొమ్మ పూజా హెగ్డే మధ్య ఈగో వార్ నడుస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సినీ అభిమానులు. ఇటీవల పూజా హెగ్డే ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఒక స్టోరీ షేర్ అయింది. అందులో ''మజిలీ'' సినిమాలోని సమంత ఫోటోను జత చేస్తూ ''ఈమె నాకు పెద్దగా అందంగా కనిపించదు'' అంటూ కామెంట్ ఉంది. దీంతో సమంత ఫ్యాన్స్ పూజా హెగ్డే పై దాడికి దిగారు. ఆ తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్న పూజా హెగ్డే తన అకౌంట్ హ్యాక్ అయినట్లు చెప్పుకొచ్చింది. వెంటనే ఆమె దీనిపై స్పందిస్తూ.. ''తన ఇన్స్టా అకౌంట్ హ్యాక్ అయ్యిందని.. తన టీమ్ కష్టపడి మళ్లీ సరిచేశారని'' చెప్పారు. హ్యాక్ చేసిన వారిని తిట్టిపోసింది. ఇది నిజంగా హ్యాకర్లు చేసిన పనా లేక ఇంకేమైనా జరిగిందో తెలియదు కానీ సమంత అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. అకౌంట్ హ్యాక్ అయ్యిందని పూజా వివరణ ఇచ్చినా ఫ్యాన్స్ అవేం పట్టించుకోలేదు. బుట్ట బొమ్మ మీద ఫైర్ అవుతూనే ఉన్నారు. ఇది ఇద్దరి ఫ్యాన్స్ మధ్య వార్ గా మారింది.
ఈ నేపథ్యంలో సమంత ఫ్యాన్స్ తమ అభిమాన నటికి పూజా హెగ్డే క్షమాపణ చెప్పాల్సిందేనంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు #PoojaMustApologizeSamantha అనే హ్యాష్ ట్యాగ్ పెడుతున్నారు. అయితే మరోవైపు #WeSupportPoojaHegde హ్యాష్ ట్యాగ్ తో పూజా ఫ్యాన్స్ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఈ రెండూ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు సామ్ ఇంస్టాగ్రామ్ స్టోరీ చూస్తే ప్రెజెంట్ జరుగుతున్న ఇష్యూ మీదే పెట్టినట్లుగా అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమంత తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఈ రోజు స్టోరీ పెడుతూ ''గుడ్ హార్ట్ కలిగి ఉండటం వలన వచ్చే మరొక సమస్య ఏమిటంటే, మీరు స్టుపిడ్ అని వారు భావిస్తుంటారు'' అని పెట్టింది. దీంతో ఇది సామ్ పూజా హెగ్డేని ఉద్దేశించే స్టోరీ పెట్టిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
అయితే ఇప్పుడు సమంత భర్త అక్కినేని నాగ చైతన్య ఎలా వ్యవహరిస్తాడు అని సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. నిజానికి పూజాహెగ్డే నాగచైతన్య సినిమా 'ఒక లైలా కోసం' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయింది. అంతేకాకుండా ప్రస్తుతం అఖిల్ అక్కినేని తో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు సమంతతో ఇష్యూ వలన అక్కినేని హీరోలు ఇక పూజా హెగ్డేని తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకోకపోవచ్చని సినీ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కినేని హీరోలు ఇగోలు ఏమీ పట్టించుకోరని.. కామ్ గోయింగ్ అని అంటుంటారు. ఇలాంటి నేపథ్యంలో బుట్టబొమ్మని పక్కన పెట్టే ఛాన్స్ లేదని మరికొందరు అంటున్నారు.