ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా.. మైత్రీ మూవీస్ కన్ఫర్మ్ చేసేసింది..
కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా భారతీయ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్, కేజీఎఫ్ ఛాప్టర్ 2 సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. అసలు అంచనాలే లేకుండా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీసుని షేక్ చేసింది. బాహుబలి సినిమా స్ఫూర్తితో ఎన్నో సినిమాలు తెరకెక్కినప్పటికీ ఏ సినిమా కూడా బాహుబలిలా విజయం సాధించలేకపోయాయి. అయితే కేజీఎఫ్ వాటన్నింటిలో కొద్దిగా బెటర్ అనే చెప్పుకోవాలి.
కేజీఎఫ్ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ప్రశాంత్ నీల్ కోసం టాలీవుడ్ నిర్మాతలు ఎగబడ్డారు. అసలేమాత్రం పరిచయం లేని హీరోతో గూస్ బంప్స్ తెప్పించే విజువల్స్ ని తెరకెక్కించిన దర్శకుడితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం చూసారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ తర్వాతి చిత్రం ఎవరితో ఉంటుందనే విషయమై అనేక రూమర్లు వచ్చాయి. ఒకసారి ఎన్టీఆర్ తో అనీ, మరోసారి మహేష్ బాబుతో అనీ వార్తలు వచ్చాయి.
అయితే మొన్నటికి మొన్న ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకుని ప్రశాంత్ నీల్ ట్వీట్ చేయడంతో ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని ఫిక్స్ అయిపోయారు. త్వరలో న్యూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చోబోతున్నానని, అందుకోసం రేడియేషన్ సూట్ వేసుకోవాలని చెప్పాడు. దీంతో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మూవీ ఫిక్స్ అయిపోయిందని అన్నారు. అయితే తాజాగా వీరిద్దరి కాంబో విషయమై మరో అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.
నేడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. టాలీవుడ్ నుండి మొదలుకుని సినిమా సెలెబ్రిటీలంతా ప్రశాంత్ నీల్ కి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అయితే ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ప్రశాంత్ నీల్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ రేడియేషన్ సూట్ వేసుకోవడానికి రెడీగా ఉండమని కోరింది. దీంతో ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమా ఉంటుందని కన్ఫర్మ్ అయినట్టే.
Wishing @prashanth_neel garu, sensational director and a gem of a Human very Happy Birthday 💝
Waiting to meet you soon in a Radiation Suit 😊 pic.twitter.com/KWSPD7D0SD — Mythri movie Makers (@MythriOfficial) June 4, 2020