కామెడీ లవర్స్ కు అదిరిపోయే న్యూస్...!
తెలుగులో హైలీ సక్సెస్ ఫుల్ సీరియల్ అమృతం. ఈ సీరియల్ ఎప్పటికి తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. అయితే తాజాగా మరోసారి సీక్వెల్తో మన ముందుకు వస్తోంది. గతంలో ఈ సీరియల్ లో భాగమైన హర్షవర్ధన్, శివ నారాయణ, వాసు ఇంటూరిలతో పాటు ఈ సారి ఎల్బీ శ్రీరామ్, సత్యకృష్ణ మనల్ని నవ్వించడానికి చేతులు కలిపారు.
ఈ ద్వితీయ భాగంకి ఎప్పటిలాగే గంగరాజు కలం పట్టగా, సందీప్ దర్శకత్వ బాధ్యతలు చేతులు కలిపారు. ఈ ద్వితీయ భాగంకి ఎప్పటిలాగే గంగరాజు కలం పట్టగా, సందీప్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. గంగరాజు , సందీప్ సంయుక్తంగా లైట్ బాక్స్ మీడియా బ్యానర్ లో మన ముందుకు రాబోతుంది.
ఎడారిలో వర్షం లాగా,
కారడవిలో వెన్నెల లాగా
మీ బిజీ లైఫ్ లో ఆనందాన్ని నింపడానికి వచ్చేస్తోంది మీ అమృత విలాస్.
New episodes of #AmruthamDhvitheeyam from 25th June on #ZEE5https://t.co/NqDuxNMjBi#AmruthamDhvitheeyamOnZEE5 #JuneChapters pic.twitter.com/YeQxLorzqU — ZEE5 Telugu (@ZEE5Telugu) June 14, 2020
ఇక అంజి పాత్రలో కనిపించిన గుండు హనుమంతరావు మరణించటంతో ఆ ప్లేస్ లో ఎల్బీ శ్రీరామ్ ని తీసుకున్నారు. ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో అమృతం వేసే పాత్ర ధారులు మారుతూ వచ్చారు. కానీ అంజి మాత్రం మాత్రం అలాగే ఉండిపోయారు.అంతలా అంజి పాత్రలో తనదైన ముద్ర వేసారు గుండు హనుమంతరావు. దాంతో ఎవరీ పాత్రకు సూట్ అవుతారు అని రకరకాలుగా ఆలోచించి చివరకు ఎల్బీ శ్రీరామ్ ని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ఇక ఈ ఎపిసోడ్ కు అమృతం ద్వితీయం అనే పేరు పెట్టారు. అలాగే కాప్షన్ .. మూర్ఖత్వానికి మరణం లేదు.
ఇదిలా ఉంటే అమృతం రీరన్ ఇప్పటికే ఈటీవి ప్లస్ లో వస్తోంది.మంచి టీఆర్పీలు వస్తున్నాయి.మరో ప్రక్క యూట్యూబ్లో కూడా ఈ సీరియల్కు విశేష ఆదరణ లభించింది. ఒక్కో ఎపిసోడ్కు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక ప్రస్తుతం జీ5 యాప్ ద్వారా అందుబాటులో ఉన్న ఈ ‘అమృతం’కు త్వరలోనే సీజన్ 2 రాబోతూండటంతో అందరిలో ఆసక్తి కలుగుతోంది. ఇక గతంలో ఉన్న నాలుగు క్యారెక్టర్లు (అమృతం, అంజి, సర్వం, అప్పాజీ) ఆధారంగానే మన మనసులకు హత్తుకునే విధంగా డిజైన్ చేస్తున్నారట.