సుశాంత్ లేడన్న నిజం నమ్మలేక పోతున్నాను: శ్రద్ధా కపూర్
బాలీవుడ్ లో ఏ నోట విన్నా ఒకటే మాట సుశాంత్ మరణ వార్త వినిపిస్తుంది.సుశాంత్ మృతిపై సంతాపం వ్యక్తం చేసిన నటి శ్రద్ధా కపూర్.. అతడు లేడన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపింది. ఇందులో భాగంగా వీరిద్దరూ కలిసున్న ఫొటోను పోస్ట్ చేయడం సహా ఇన్స్టాలో భావోద్వేగభరిత అంశాల్ని పంచుకుంది.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇక లేడన్న నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని హీరోయిన్ శ్రద్ధా కపూర్ చెప్పింది. అతడితో ఉన్న సందర్భాలను గుర్తుచేసుకుంది. దయ, జాలి, చురుకుదనం, తెలివి, ఉత్సుకత లాంటి సద్గుణాలు సుశాంత్ ఉన్నాయని తెలిపింది. "ది సీక్రెట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జీనియస్" పుస్తకం కవర్పేజితో సహా వీరిద్దరు కలిసి ఉన్న ఓ ఫొటోను ఇన్స్టాలో పంచుకుని, భావోద్వేగ పోస్ట్ పెట్టింది.
గతేడాది వచ్చిన 'చిచ్చోరే'లో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో సుశాంత్ తనతో ఎలా ఉండేవాడో ఆ సందర్భాలను గుర్తుచేసుకుంది శ్రద్ధా.
auto 12px; width: 50px;">View this post on InstagramBeen trying to accept what has happened and coming to terms with it is very difficult. There is a huge void... Sushant...! Dearest Sush...! Full of humility, intelligence, curiosity about life, seeing {{RelevantDataTitle}}