అతడు సినిమాలో త్రిష చెప్పిన ఆ ఒక్క డైలాగ్.. మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది..?

praveen

తెలుగు చిత్ర పరిశ్రమలో త్రిష కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపుగా ఒక దశాబ్ద కాలం పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో తన హవా నడిచింది త్రిష . ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది అని చెప్పాలి. తన హాట్ హాట్ అందాలతో తెలుగు ప్రేక్షకులనూ ఆకర్షించడంతో పాటు... తన వైవిధ్యమైన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది అనే చెప్పాలి. ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోయి నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించి త్రిష.





 అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో త్రిష పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులందరికీ గుర్తొచ్చే సినిమా అతడు. మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన అతడు  సినిమాలో మహేష్ బాబు సరసన అందాల ముద్దుగుమ్మ త్రిష నటించింది. అయితే ఈ సినిమాలో త్రిష గడుసు పిల్ల గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో త్రిష తన అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది అనే చెప్పాలి. అప్పట్లో ఈ సినిమా మంచి విజయం సాధించి త్రిషకు మంచి క్రేజ్ తెచ్చింది. 




ఈ సినిమాలో త్రిష చెప్పే ప్రతి డైలాగ్ కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది అని చెప్పాలి . సినిమాలో త్రిష చెప్పే  ప్రతి డైలాగు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మహేష్ బాబు తన ఫ్యామిలీ ని కలవడానికి వచ్చినప్పుడు... కింద పెళ్లిచూపులు అవుతుంటే నువ్వు పైన ఎందుకు కూర్చున్నావ్ అని మహేష్ బాబు త్రిష అని ప్రశ్నించగా... నేను కిందికి వెళ్తే పెళ్లిచూపులు చెడిపోతాయి ఎందుకంటే అక్క అంబాసిడర్ నేను బెంజ్ అంటూ త్రిష చెప్పిన డైలాగ్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా  అక్కాచెల్లెళ్లకు బాగా కనెక్ట్ అయింది ఈ డైలాగ్. దీంతో త్రిష చెప్పిన ఈ డైలాగ్ త్రిష ను  బాగా ఫేమస్ చేయడంతో పాటు తెలుగు ప్రేక్షకులకు పలు సందర్భాల్లో ఉపయోగపడింది అనే చెప్పాలి.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: