విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ మూవీపై రూమర్స్..!

NAGARJUNA NAKKA

కరోనా అనేది ఒక వైరస్సే కాదు. అదొక రూమర్ కూడా. ఈ మహమ్మారి ఉన్నచోట ఉండకుండా.. రూమర్స్ కూడా తీసుకొస్తోంది. దర్శకనిర్మాతలు ఈ పుకార్లకు క్లారిటీ వస్తోంది. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ సినిమాపై కూడా రూమర్స్ వచ్చేశాయి. 

 

పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ సినిమా యాక్షన్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఒరిజినల్ టైటిల్ ను త్వరలో ప్రకటిస్తారట. కరోనా రావడానికి ముందు ఫైటర్ ముంబయిలో 40రోజుల భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. హీరోహీరోయిన్లు విజయ్, అనన్య పాండేపై లవ్ సీన్స్ తీశారు. అలాగే.. విజయ్, తల్లిగా నటిస్తున్న రమ్యకృష్ణపై మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. 

 

ఇండియా మొత్తంలో కరోనా ప్రభావం మహారాష్ట్రలో అందులోనూ ముంబైలో ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడకు వెళ్లి షూటింగ్ తీయడం కష్టమని.. అందుకే స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నారని వార్తలు గత కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తోంది. ఇదే విషయాన్ని ఓ నెటిజన్ ఛార్మీని మార్చే ప్రసక్తేలేదని చెప్పింది. 

 

ఫైటర్ మూవీపై ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉంది ఛార్మి. ఇదొక బ్లాక్ బస్టర్ స్క్రిప్ట అనీ.. మార్చే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చింది. కరోనా క్రైసిస్ తగ్గిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తామని.. సినిమా పట్ల సూపర్ డూపర్ హిట్ నమ్మకంతో ఉన్నామని చెప్పింది ఛార్మి. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామ్యంలో పూరీ, ఛార్మీ కలిసి పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. 

 

ఫైటర్ మూవీపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. విజయ్ దేవరకొండకు మాస్ ప్యూపుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. పైగా పూరీజగన్నాథ్ దర్శకత్వం కావడంతో యూత్ లో ఫుల్ యాక్సైటింగ్ నెలకొంది. ఫైటర్ అనే టైటిల్ వాళ్లలో కొత్త ఉత్సాాహాన్ని నింపుతోంది. చూడాలి మరి ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో. ప్రేక్షకులు ఈ మూవీని ఎలా ఆదరిస్తారో. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: