జానకి అమ్మ ఆరోగ్య పరిస్థితిపై ఎస్పీ బాలు సంచలన వ్యాఖ్యలు...!
భాష బేధం లేకుండా అన్ని వర్గాల జనాల మనసులను గెలుచుకున్న గాన కోకిల. ఆమె కనిపిస్తే.. ఎవరైనా సరే.. జానకి అమ్మ అని పిలుస్తుంటారు. అంతగా ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న ఆమెపై తప్పుడు వార్తలు రావడం ప్రతి ఒక్కరిని కలచి వేసింది. 82 సంవత్సరాల వయసు ఉన్న జానకి గారు ఇటీవల కొంత అస్వస్థతకు గురైయ్యారు.
జానకి అమ్మ వయసు ప్రస్తుతం 82 సంవత్సరాలు. మూడు దశాబ్దాలకు పైగా దక్షిణాది సంగీత ప్రియులను మంత్ర ముగ్ధులను చేసిన గాత్రం జానకి అమ్మది. సినిమా ఇండస్ట్రీలోనే వైవిధ్యమైన గాయని ఆమె. తన సుధీర్ఘ కెరీర్లో 45 వేలకు పైగా పాటలు పాడారు. నైటింగేల్ ఆఫ్ సౌత్గా పిలుచుకునే జానకి అమ్మ.. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యంలో అత్యధిక పాటలు ఆలపించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సహా 17 భాషల్లో జానకి అమ్మ పాటలు పాడారు.
Shri. SP Balasubramanyam Garu Trashes all the rumours about Legendary singer Shri.Janaki Garu
She is Safe and Healthy pic.twitter.com/ST1DFffWf5 — bheeshma Talks (@BheeshmaTalks) June 29, 2020
ఇదిలా ఉంటే, జానకి అమ్మ ఆరోగ్యంపై వచ్చిన రూమర్పై గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్పందించారు. ఇలాంటి రూమర్లు ఎందుకు పుట్టుకొస్తాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఆయన ఒక వీడియో మెసేజ్ను పోస్ట్ చేశారు. జానకి అమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి ఉదయం నుంచి నాకు 20 మంది ఫోన్ చేశారు. దీనికి కారణం సోషల్ మీడియాలో కొంత మంది జానకి అమ్మ చనిపోయారంటూ పోస్టులు పెట్టడమే. నేను ఆమెతో మాట్లాడాను. ఆమె చాలా బాగున్నారు’’ అని బాలు స్పష్టం చేశారు.
అలాగే సింగర్ మనో కూడా జానకి గారి ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడే జానకి అమ్మతో మాట్లాడాను. ఆమె మైసూర్ లో ఉన్నారు. ఆమె ఆరోగ్యం కూడా చాలా బావుంది అంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని ట్వీట్ చేశారు. సింగర్ బాల సుబ్రహ్మణ్యంతో పాటు మనోతో కూడా జానకి గారు అప్పట్లో అత్యదిక పాటలు పాడిన విషయం తెలిసిందే.