ఆ హీరో మరణంపై సరోజ్‌ ఖాన్‌ ఎమోషనల్ కామెంట్‌.. వైరల్‌ అవుతున్న చివరి పోస్ట్‌

JSR
బాలీవుడ్‌ సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. లాక్‌ డౌన్‌ సమయంలో వరుసగా సెలబ్రిటీ మరణిస్తుండటంతో ఇండస్ట్రీలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇర్ఫాన్‌ ఖాన్‌, రిషీ కపూర్‌, సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ లాంటి స్టార్స్‌ తో పాటు టీవీ, సోషల్‌ మీడియా స్టార్స్‌ కూడా కొద్ది నెలల సమయంలోనే తుది శ్వాస విడిచారు. ఈ విషయాలు మరిచిపోక ముందు శుక్రవారం లెజెంబరీ కొరియోగ్రాఫర్ సరోజ్‌ ఖాన్‌ తుది శ్వాస విడిచారు.

ఉత్తరాది సీనియర్‌ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ ఖాన్‌ శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఎన్నో సూపర్‌ హిట్‌ పాటలకు, టాప్‌ హీరో హీరోయిన్లకు కొరియోగ్రాఫీ అందించిన సరోజ్‌ ఖాన్‌ మరణం బాలీవుడ్‌ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. జూన్‌ 20వ తేదిన గుండె నొప్పి రావటంతో సరోజ్‌ ఖాన్‌ను ముంబైలోని గురు నానక్‌ హాస్పిటల్‌లో చేర్పించారు. ఆ రోజు నుంచి ఆమె ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించటంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

మథర్‌ ఆఫ్‌ డాన్స్‌గా పేరు తెచ్చుకున్న సరోజ్‌ ఖాన్‌ను ఇండస్ట్రీ అంతా మాస్టర్‌జీ అని ప్రేమగా పిలుచుకుంటారు. దాదాపు 40 సంవత్సరాల పాటు కొరియోగ్రాఫర్‌గా సేవలందించిన సరోజ్‌ ఖాన్‌ 200లకు పైగా సినిమాలకు నృత్య రీతులు అందించారు.

 అయితే తన చివరి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ను జూన్‌ 14న పోస్ట్ చేశారు. ఆ రోజు బలవన్మరనానికి పాల్పడిన సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ గురించి ఎమోషనల్‌గా స్పందించారు సరోజ్‌ ఖాన్‌. సుశాంత్ సింగ్‌తో ఎప్పుడు వర్క్ చేయకపోయినా తను ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె కోరుకుంటున్నట్టుగా తెలిపారు. ఇప్పుడు ఆమె మరణం తరువాత ఆ పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
I had never worked with you @sushantsinghrajput but we have meet many times. What went wrong in your LIFE?I'm shocked that you took such a drastic step in your LIFE. You could have spoken to an Elder which could have helped YOU and would have kept us Happy looking at YOU.

A post shared by Saroj Khan (@sarojkhanofficial) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: