ఆ విషయంలో కీరవాణి కంటే ఆయన భార్య చాలా షార్ప్ తెలుసా..?
ఎమ్ఎమ్ కీరవాణి ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన మనసు మమత అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అయితే మొదటి సినిమాతో అంతగా గుర్తింపు సంపాదించుకొక పోయినప్పటికీ ఆ తర్వాత సీతారామయ్యగారి మనవరాలు అనే సంగీత నేపథ్యం ఉన్న సినిమా రావడంతో ఈ సినిమాలో సంగీతం అందించి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించారు. ఇక ఆ తర్వాత కీరవాణి ఇక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు అనే చెప్పాలి, తెలుగు సంగీతాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.
ఇక మాతృదేవోభవ సినిమా లో కీరవాణి అందించిన సంగీతం ఆయనను మరింత ఎలివేట్ చేసింది అంతేకాకుండా ఈ సినిమాలో రాలిపోయే పువ్వా అనే పాట ను స్వయంగా తానే పాడి మరింత గుర్తింపు సంపాదించారు. అయితే కీరవాణి కంటే ఓ విషయంలో ఆయన భార్యని ఎంతో షార్ప్ గా ఉంటారట ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో కీరవాణి చెప్పుకొచ్చారు. ఎదుటి వాళ్ళు ఏదైనా అన్నప్పుడు వాళ్ల ముందు ఏమీ అనకొండ ఇంటికి వెళ్ళాక ఇలా అని ఉంటే బాగుండు అని కీరవాణి అనుకుంటారట... కానీ ఆయన భార్య మని మాత్రం ఎదుటి వాళ్ళు ఏదైనా అన్నారు అంటే వెంటనే దానికి సరైన బదులు ఇచ్చేస్తారట. ఇలా సరిగ్గా స్పాంటేనియస్గా స్పందించడంలో ఆయన సతీమణి ఎప్పుడూ తన కంటే షార్ప్ ఉంటుందని కీరవాణి చెప్పుకొచ్చారు.
Powered by Froala Editor