మితిమీరిన అందాలతో యూత్ను షేక్ చేసిన ప్రియమణి!!
ప్రియమణి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ కేరళ కుట్టి అసలు పేరు ప్రియ వసుదేవ మణి అయ్యర్. దాన్నే షార్ట్ చేసి ప్రియమణి అని స్క్రీన్ నేమ్ పెట్టుకుంది. తెలుగులో మొదట 2003లో `ఎవరే అతగాడు?` సినిమాతో తెరంగేట్రం చేసినా.. ప్రేక్షకులకు చేరువ కాలేకపోయింది. ఆ తర్వాత తమిళంవైపు కొన్నాళ్లు దృష్టి పెట్టి మళ్లీ `పెళ్ళైనకొత్తలో..` అంటూ హీరో జగపతి బాబుతో జతకట్టింది. ఈ సినిమాతో ప్రియమణి ఫేట్ మారిపోయిందనే చెప్పాలి.
ఎందుకంటే ఈ సినిమా తర్వాత ఒకేసారి తెలుగులో మూడు అవకాశాలు వచ్చి చేరాయి. ఒక వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్ అనే తేడా లేకుండా బిజీగా ఉండే హీరోయిన్గా మారిపోయింది. కేరళ కుట్టి అయినప్పటికీ.. తెలుగులో చిన్న స్థాయి హీరోయిన్గా కెరీర్ను ఆరంభించి.. చాలా త్వరగానే స్టార్ హీరోయిన్గా ఎదిగింది ఈ బ్యూటి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, నాగార్జున, బాలకృష్ణ, రవితేజ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు చేసిన ప్రియమణి.. తెలుగు ఇండస్ట్రీలో దాదాపు ఐదారేళ్లు మంచి జోరు మీద కొనసాగింది.
ఇక గ్లామర్ పరంగా పెద్ద అడ్డంకులు కూడా ప్రియమణి చెప్పింది లేదు. బికినీలో కనిపించడానికి కూడా వెనకాడలేదు. ఈ క్రమంలోనే మితిమీరిన అందాల ప్రదర్శనతో తెలుగు ప్రేక్షకులకు షేక్ చేసింది ఈ కేరళ కుట్టి.పెర్ఫామెన్స్ ప్రదర్శించే పాత్రల కంటే ఎక్కువగా గ్లామర్ రోల్స్ పోషించిన ప్రియమణి ఎందరో అభిమానులు సంపాధించింది. అయితే ఆ తర్వాత కాలం కలిసిరాకో మరొకటో కానీ ప్రియమణి కెరీర్ అనుకున్నంతగా ముందుకు కదిలింది లేదు. అయితే కెరీర్ లో కదలిక లేకపోవడంతో పెళ్లి చేసుకుని సెటిల్ అయిన ప్రియమణి.. ప్రస్తుతం మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ కేరళ కుట్టి వెంకటేష్ హీరోగా తెరకెక్కితున్న నారప్ప సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే.. మళ్లీ ప్రియమణి ఫామ్లోకి వచ్చినట్టు అవుతుంది.